పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (దీదీ)కి మరో షాక్. తృణముల్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సృంజయ్ బోస్ గుడ్ బై చెప్పారు. పార్టీకి చెందిన అనే్క మంది ప్రజాప్రతినిదులను శారదా కుంభకోణం అంశం ఇంకా అట్టుడికిస్తూనే ఉంది. సీబీఐ అరెస్టులు, ప్రశ్నల పర్వానికితోడు పార్టీ నేతల రాజీనామాలతో దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పలువురు నేతలు టీఎంసీకి టాటా చెప్పగా... తాజాగా శారదా స్కాంలో జైలుకు వెళ్లి, బెయిల్పై బయటకు వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు సృంజయ్ బోస్ ఆ పార్టీకి, ఎంపీ పదవికి గురువారం రాజీనామా చేశారు.
శారదా చిట్ఫండ్ కుంభకోణం కేసులో 75 రోజులుగా జైల్లో ఉండి విడుదలైన పార్టీ ఎంపీ సృంజయ్బోస్ బెయిల్పై విడుదలైన మరుసటి రోజునే తృణముల్ కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో పశ్చిమ బెంగాల్ మహిళా కమిషన్ సభ్యురాలు, సినీ నటి లోకేత్ చటర్జీ గురువారం తృణమూల్ కాంగ్రెస్కు రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు.
మరోవైపు శారదా చిట్ఫండ్ కుంభకోణంపై సీబీఐ చేస్తున్న దర్యాప్తును ప్రత్యక్షంగా పర్యవేక్షించాలన్న పశ్చిమబెంగాల్ ప్రభుత్వ విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనికి సంబంధించి సీబీఐ ఎలాంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నట్లుగానీ బెంగాల్ ప్రభుత్వం పేర్కొనలేదని జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ సి.నాగప్పన్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more