ఎంసెట్ ప్రవేశ పరీక్ష్ల నిర్వహణపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన పీటముడి ఎట్టకేలకు విడిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇరు రాష్ట్రాలు ఆయా రాష్ట్ర విద్యార్థులకు ప్రత్యేకంగా ఎంసెట్ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ ప్రవేశ పరీక్షల బాధ్యతలను కాకినాడ జేఎన్ టీయుకు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి నిర్ణయించింది. కాగా తెలంగాణలో హైదరాబాద్ జేఎన్ టీయూ ఈ పరీక్షలను యధావిధిగా నిర్వహించనుంది.
విభజన చట్టంలోని పదో షెడ్యూలులో ఉన్న విద్యా సంస్థలన్నీ పదేళ్ల పాటు ఉమ్మడిగా ఉండాలన్న నిబంధనను తోసిరాజిన తెలంగాణ ప్రభుత్వం ఎంసెట్ ప్రవేశ పరీక్షఃల విషయంలో నిబంధనలను ఉల్లంఘిస్తుందని అభిప్రాయపడిన ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఈ విషయంలో కేంద్రానికి పిర్యాదు చేయాలన్న నిర్ణయానికి వచ్చాయి. ఉమ్మడి ఎంసెట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో ముందుగానే చర్చించి షెడ్యూల్ను విడుదల చేసినందున ఈ విషయమై కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి స్మృతి ఇరానీకి తెలంగాణ సర్కారు నిర్నయంపై పిర్యాదు చేయాలని భావిస్తున్నాయి. తెలంగాణ తీరుపై కోర్టుకు వెళ్లడం వల్ల పరీక్షలు ఆలస్యమై విద్యార్థులకు నష్టం వస్తుందని, కనుక కేంద్రానికి ఫిర్యాదు చేయాలన్న అభిప్రాయానికి వచ్చారు.
షెడ్యూల్లో మార్పులు లేకుండానే ప్రవేశ పరీక్షలు...
ఎంసెట్ను వేరుగా నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ అంశాన్ని ఏపీ ఉన్నత విద్యామండలి ద్వారా అధికారిక ప్రకటన చేయించనుంది. సీఎంతో సమావేశానంతరం మంత్రి గంటా ఉన్నత విద్యాశాఖాధికారులు, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డిలతో మాట్లాడారు. విశాఖపట్నంలో ఇవాళ మరోసారి సమావేశం నిర్వహించి ఎంసెట్తో సహా వివిధ ప్రవేశ పరీక్షలపై అధికారిక ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే ఏపీ ఉన్నత విద్యామండలి వివిధ సెట్లకు షెడ్యూల్ను ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారమే సెట్ పరీక్షలు జరుగుతాయని ఉన్నత విద్యామండలి తెలిపింది. ప్రభుత్వాలు నిర్వహించే సెట్ల తేదీలన్నిటినీ సరిచూసుకున్నాకనే షెడ్యూల్ను రూపొందించినట్లు వివరించారు.
కాకినాడ జేఎన్టీయూకు ఎంసెట్ పరీక్షల బాధ్యత...
ఎంసెట్ బాధ్యతను కాకినాడ జేఎన్ టీయూకు అప్పగించాలని ఆంధ్రప్రధశ్ ప్రభుత్వం భావిస్తుస్తోంది. కాకినాడ జేఎన్టీయూ నిర్వహిస్తున్న ఈసెట్ను వేరే వర్సిటీకి అప్పగించనున్నారు. ఎడ్సెట్ను ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహిస్తున్నందున దానికే ఆ బాధ్యతలను కొనసాగించవచ్చని చెప్తున్నారు. లాసెట్ను శ్రీవెంకటేశ్వర వర్సిటీ, పీఈసెట్ను నాగార్జున వర్సిటీ నిర్వహిస్తున్నందున వాటికే ఆయా సెట్ల బాధ్యత కొనసాగించనున్నారని తెలుస్తోంది. ఐసెట్ను, పీజీఈసెట్ను ఏపీలోని వేరే యూనివర్సిటీలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఐసెట్ను ఏయూకి కేటాయించవచ్చని తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎంసెట్ను జేఎన్టీయూ హైదరాబాద్ నిర్వహించేది. కాగా ఇప్పుడు తెలంగాణ ఎంసెట్ బాధ్యతలను నిర్వహించనుంది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more