ప్రస్తుత టీమిండియాలో అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భారత్ జట్టు.. నేడు నవ్వులపాలైపోతోంది. గతంలో అద్బుతంగా తమ ఆటతీరుతో జట్టును గెలిపించిన కొందరు ఆటగాళ్లు ఇప్పుడు పేలవ పెర్ఫార్మెన్స్’తో చతికిలపడిపోతున్నారు. నిన్నటివరకు సన్నిహితంగా మెలిగిన ఆటగాళ్లు.. ఇప్పుడు ఒకర్నొకరిపై విమర్శించుకుంటున్నారు. ఇక జట్టులో వున్న ఇతర ఆటగాళ్లకు ఆదర్శంగా నిలిచిన కెప్టెన్ ధోనీ, కోహ్లీల మధ్యే విభేదాలొచ్చాయని వార్తలొస్తున్నాయి. జట్టులో కీలకపాత్ర పోషించే ఈ ఇద్దరి ఆటగాళ్ల మధ్య ఓ సందర్భంలో వాదించుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు.
ముక్కోణపు సిరీస్’లో భాగంగా ఇండియా జట్టు ఘోరంగా విఫలమవుతున్న విషయం తెలిసిందే! అందులోనూ జట్టుకు వెన్నముకగా పేరొందిన కోహ్లీ అత్యంత దారుణంగా ప్రదర్శించడంతో విమర్శలు తలెత్తుతున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్’లో అద్భుతంగా రాణించిన కోహ్లీ.. ఇప్పుడు ఈ వన్డే సిరీస్’లో మూడు మ్యాచులకు కేవలం 16 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే.. కోహ్లీ ఈ విధంగా దారుణంగా విఫలం అవడానికి కారణం ధోనీయేనంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. ఈ వన్డే సిరీస్’లో ఒక్కొక్క మ్యాచ్’కు కోహ్లీ బ్యాటింగ్ పొజిషన్’ను ధోనీ మారుస్తూ వస్తున్నాడు. అలా మార్చడం వల్ల కోహ్లీ ఆటపై దృష్టి సారించలేకపోతున్నాడని అందరి అభిప్రాయం!
అయితే ఇదే విషయమై ధోనీ, కోహ్లీకి తనదైన రీతిలో సూచించినట్లు సమాచారం! జట్టు ప్రయోజనాల కోసం ఆటగాడు కొన్నిసార్లు త్యాగాలు చేయాల్సి వుంటుందని పేర్కొన్న ధోనీ.. ప్రతి మ్యాచ్’లోనూ ఎప్పుడూ ఒకే స్థానంలో బ్యాటింగ్ చేయాలనుకోవడం సరికాదని కోహ్లీకి సూచించాడు. ‘‘తుది జట్టులో వుండే 11 మందిలో ఎవరు, ఎక్కడ ఆడినా.. జట్టుకు లాభం కలగడం ముఖ్యం. అందువల్ల తనకు నచ్చిన స్థానంలో ఆడుతున్న ఆటగాడు ఒక్కోసారి త్యాగం చేయాల్సి వస్తుంది. అప్పుడు జట్టులో మార్పు, ఫలితాన్ని గ్రహించగలం’’ అని కోహ్లీకి ధోనీ వివరణ ఇచ్చాడని తెలుస్తోంది. దీనికి కోహ్లీ కూడా సమ్మతం తెలిపినట్లు వర్గాలు తెలుపుతున్నాయి.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more