కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునందాపుష్కర్ గతేడాది జనవరి 17 తేదీన మరణించిన విషయం తెలిసిందే! అప్పట్లో ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు భావించిన తరునంలో తర్వాత అనుమానాస్పద కేసుగా నమోదు చేయడం జరిగింది. ఇక అప్పటినుంచి విచారణలు చేపట్టిన చాన్నాళ్ల తర్వాత ఆమె మృతి కేసులో ఒక సరికొత్త మలుపు చోటు చేసుకుంది. ఆమె మరణం పాయిజన్’తో అయిందని తేలిన నేపథ్యంలో సిట్ దీనిపై దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే సిట్ ఇటీవలే శశిథరూర్’ను విచారించడం జరిగింది కూడా! తాజాగా ఈ కేసులో రాష్ట్రీయ లోక్ దళ్ నేత అమర్ సింగ్ ను ఢిల్లీ పోలీసుల నేతృత్వంలో సిట్ విచారించడం జరిగింది.
దాదాపు రెండుగంటలపాటు అమర్ సింగ్’ను సిట్’ను విచారించింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు అధికారులు ఆయన్ను 20 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం! అయితే.. విచారణ ముగిసిన తర్వాత అమర్ వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు. ప్రస్తుతం కేసులో దర్యాప్తు జరుగుతన్నందు వల్ల దీనిపై తనకు ఏ ప్రకటనా చేసే అధికారం లేదని ఆయన తేల్చి చెప్పేశారు. ఈ కేసు వెనుక దాగివున్న నిజానిజాలను సిట్ తేలుస్తుందని ఆయన అన్నారు. తనకు, సిట్’కు మధ్య విచారణ వివరాల గురించి పెదవి విప్పని ఆయన... థరూర్, సునంద మధ్య వున్న సంబంధం గురించి సిట్ తనను అడిగినట్లు చెప్పారు. అంతే! అదొక విషయం తప్ప ఆయన ఇతర వివరాను వెల్లడించలేదు.
మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. శశిథరూర్’నను తాను గౌరవిస్తానని, ఆయనకు వ్యతిరేకం కాదని తెలిపారు. ఈ కేసులో వాస్తవాలు బయటికి రావాలని తాను కోరుకుంటున్నట్లుగా తెలిపారు. సునంద గురించి తనకు తెలిసిన విషయాలను పోలీసులకు క్లుప్తంగా వివరించానని తెలిపారు. ఈ కేసులో మొదటిసారి తనను విచారణకు పిలిచారని పేర్కొన్న ఆయన.. తర్వాత ఎన్నిసార్లు పిలిచినా వస్తానని స్పష్టం చేశారు. కేసు చిక్కుముడి విడిపోయేవరకు తనవంతు సహాయాన్ని పోలీసులకు అందిస్తారని తెలిపారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more