ప్రస్తుతరోజుల్లో డబ్బు విలువ ఎంతమేరకు వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు! డబ్బులకోసం కొందరు ఎంతటి దారుణానికైనా పాల్పడేందుకు సిద్ధపడుతుంటారు. ఆఖరికి తమ తల్లిదండ్రులను సైతం చంపేందుకు వెనుకాడరు. అంతటి దుస్సాహసం చేయలేని మరికొందరు.. ఆస్తికోసం తల్లిదండ్రులను నిత్యం హింసించడాన్ని పనిగా పెట్టేసుకుంటున్నారు. ఇక కొందరు ఉద్యోగస్తులైతే.. వేతనంతో జల్సాలు చేస్తుంటారు కానీ కుటుంబసభ్యులను ఏమాత్రం పట్టించుకోరు. అయితే.. ఇప్పుడు వారందరికీ బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారు ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్.
ఉద్యోగం రాగానే అహంకారంతో తమ తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగస్తులకు గుణపాఠం నేర్పేందుకు ఈటెల రాజేందర్ ఓ మంచి ప్రతిపాదనను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ తల్లిదండ్రులను పట్టించుకోకపోతే.. వారి జీతాల నుంచి ఫించను చెల్లించేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. తల్లిదండ్రులతో సఖ్యతగా వుంటూ, వారి బాగోగులు చూసుకోవాలంటూ ఆయన ప్రభుత్వ ఉద్యోగస్తులను సూచిస్తున్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా జూపల్లి మండలం గర్రెపల్లిలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో భాగంగా పాల్గొన్న ఈటెల... ఈ విధంగా పేర్కొన్నారు.
ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆడబిడ్డలకు కానుకగా నియోజకవర్గానికి కొత్తగా 5వేల గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రప్రభుత్వంపై రూ.800 కోట్లు భారం పడుతున్నప్పటికీ.. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటోందన్నారు. అంతేకాదు.. గుడిసెల్లో బతుకుతున్నవారికి 125 గజాల స్థలాన్ని కేటాయించడంతోపాటు రెండు పడకగదుల నిర్మాణం, గ్రామీణ ప్రాంతాల్లో 3.5 లక్షలతో అన్ని సౌకర్యాలతో కూడిన ఇల్లు నిర్మించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. మార్చి 1వ తేదీ నుంచి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెడుతుందన్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more