తెలంగాణలో ప్రజల ప్రాణాలను బలిగొంటున్న మాయదారి రోగంపై ప్రధాని నరేంద్రమోడీ ఆరా తీశారు. రాష్ట్రంలో స్వైన్ఫ్లూపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీతో ఫోన్లో చర్చించగా, ఆయన ఈ మేరకు ఆరా తీసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక వైద్య బృందాలను పంపాలని కేసీఆర్, ప్రధానికి విన్నవించారు. అందుకు సమ్మతించిన ప్రధాని మోడీకి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. సమన్వయం చేసి సహకరించాల్సిందిగా కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయలను సీఎం కోరారు.
రాష్ట్రంలో స్వైన్ఫ్లూ ప్రబలటంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. స్వైన్ఫ్లూపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీఎస్ రాజీవ్శర్మతో ఫోన్లో మాట్లాడి తాజా పరిస్థితిని తెలుసుకున్నారు. స్వైన్ఫ్లూ పరిస్థితులపై ఇవాళ నివేదిక ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖను ఆదేశించారు. స్వైన్ ఫ్లూతో మంగళవారం నలుగురు వ్యక్తులు మరణించడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్వైన్ఫ్లూపై చర్చించేందుకు సాయంత్రం కేబినెట్ భేటీ ఏర్పాటు చేయాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు.
అయితే తెలంగాణలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తున్న ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం పట్ల కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వైన్ ఫ్లూపై సమీక్ష జరిపి వెంటనే నివేదిక అందజేయాలని కేసీఆర్... తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మను ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో మరో 20 రోజులు చలిగాలులు ఉంటాయిని... ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. స్వైన్ ఫ్లూతో గత రెండు నెలల కాలంలో మొత్తం 26 మంది మృతి చెందడంపై కూడా కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more