ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రానురాను వేడెక్కుతున్నట్లు కనిపిస్తున్నాయి. నిన్నటివరకు వైకాపా, టీడీపీ పార్టీలు ఒకర్నొకరు దూషించుకోగా.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సైతం వీరి మధ్యలో చేరిపోయినట్లు కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో భారీగా ఓటమిని చవిచూడటంతో ఆంధ్రాలో కనీసం ఒక్క సీటు కూడా దక్కించుకోకపోవడంతో నిన్నటివరకు కనుమరుగైపోయిన కాంగ్రెస్ పార్టీ.. మళ్లీ తన బలాన్ని పుంజుకోవడం కోసం బరిలోకి దిగినట్లు కనిపిస్తోంది.
ప్రముఖ సినీనటుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి 19వ వర్ధంతి సందర్భంగా ఆదివారం నందమూరి కుటుంబసభ్యులతోపాటు టీడీపీ పార్టీ నేతలు, సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ సమాధికి నివాళులు అర్పించిన విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలో బాబుతోపాటు మరికొంతమంది నేతలు రాష్ట్రాభివృద్ధికి సంబంధించి కొన్ని హామీలు ప్రకటించారు. అనంతరం బాబు తన పాదయాత్రలో బిజీగా వుండిపోయారు. తన పాదయాత్రలో సందర్భంగా ప్రజలతో మమేకమై వారి కష్టాలను తెలుసుకుంటూ కొంతమేర ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు.
అయితే.. టీడీపీ పార్టీలు కేవలం జనాలను ఆకర్షించడం కోసమే ఇలాంటి పనులు చేస్తోందంటూ ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలోనే మాట్లాడుతూ.. ఇంకా ప్రారంభించని పథకాలకు కూడా ఎన్టీఆర్ పేరు పెట్టి, ఆ మహానుభావుడి పేరును అప్రతిష్టపాలు చేస్తున్నారని అన్నారు. టీడీపీ పార్టీ సిగ్గులేకుండా ఆయన పేరును అడ్డం పెట్టుకుని ప్రజలకు ఆకర్షిస్తోందని దుయ్యబట్టారు. ఎన్టీఆరే గనుకు ఇప్పటికీ బతికుంటే.. ప్రస్తుతం టీడీపీ అనుసరిస్తున్న విధానాలను ఆ పార్టీ నేతలను పరుగెత్తించి మరీ కొట్టేవారని వ్యాఖ్యానించారు. మరి.. దీనిపై టీడీపీ నేతలు ఏ విధంగా తమ వ్యాఖ్యానాలు సంధిస్తారో..?
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more