ఉగ్రవాదాలు ఎక్కడ ఎప్పుడు దాడులకు తెగబడతారో తెలియని పరిస్థితుల్లో తమిళనాడులో ఓ యువతి కలకలం సృష్టించింది. ఓ గూడ్స్ రైలులో ఓ యువతి నక్కి ఉండటం.. కొద్ది సేపు పోలీసులను ఉత్కంఠకు గురిచేసింది. కోయంబత్తూరు నుంచి వచ్చిన గూడ్స్ రైలులో ఓ యువతి నక్కి వుండడాన్ని చెన్నైలో భద్రతా సిబ్బంది గుర్తించారు. గూడ్స్ రైలులో నక్కి రావాల్సిన అవసరం యువతికి ఎందుకు వచ్చింది..? ఇంతకీ అమె ఎవరు..? ఆమె తీవ్ర వాదా? అన్న అనుమానాలు నెలకొన్నాయి. ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు అమెను చేధించి పట్టుకున్నారు.
ఆంధ్ర ప్రదేశ్కు చెందిన యువతిగా భావిస్తున్నారు. రాష్ట్ర రాజధాని నగరం చెన్నై, ఆధ్యాత్మిక కేంద్రం మదురై తీవ్రవాదుల హిట్లిస్టులో ఉండడంతో పోలీసులు అప్రమత్తంగానే వ్యవహరిస్తున్నారు. ఎవరి మీదైనా సరే చిన్న పాటి అనుమానం వచ్చినా అదుపులోకి తీసుకుని విచారించడం, ఆపై విడుదల చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాట్టుపల్లి హార్బర్కు వచ్చిన గూడ్స్ రైల్లో ఓ యువతి నక్కి ఉండడం చర్చనీయాంశంగా మారింది.
చెన్నై శివారులోని పొన్నేరి - మీంజూర్ సమీపంలోని కాట్టు పల్లి హార్బర్కు బొగ్గు రవాణా అవుతోంది. ఇక్కడికి వచ్చే నేల బొగ్గును రాష్ర్టంలోని తూత్తుకుడి, మెట్టూరు, ఉత్తర చెన్నై తదితర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు పంపిస్తుంటారు. ఈ పరిస్థితుల్లో కోయంబత్తూరు నుంచి చెన్నైకు ఓ గూడ్స్ రైలు వచ్చింది. ఉత్తర చెన్నై విద్యుత్ కేంద్రానికి సమీపంలో కాట్టు పల్లి వైపుగా వెళ్తున్న ఈ గూడ్స్లోని ఓ బోగిలో ఎవరో ఉన్నట్టుగా భద్రతా సిబ్బంది గుర్తించారు.
రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది అన్ని బోగీలను పరిశీలించారు. ఓ బోగిలో యువతి నక్కి ఉండటంతో కాసేపు ఆందోళనలో పడ్డారు. ఆమెను అదుపులోకి తీసుకుని పొన్నేరి డీఎస్పీ శేఖర్కు అప్పగించారు. ఆమెను తీవ్రంగా విచారిస్తున్నారు. 21 ఏళ్ల ఆ యువతి పేరు స్టాన్లీగా ఆంధ్ర వాసిగా భావిస్తున్నారు. ఆమె మెట్టూరులో గూడ్స్లోకి ఎక్కినట్టు తేలింది. అయితే, మెట్టూరు వద్ద ఆమె ఎలా గూడ్స్లో ఎక్కిందో, అక్కడి భద్రతా సిబ్బంది కళ్లు గప్పి ఎలా ప్రవేశించ గలిగిందోనన్న అనుమానాలు నెలకొన్నాయి.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more