Express train rams into a temple six injured

Express train rams into temple, Express trains rams in Madhya Pradesh, six injured as Express train rams temple, Express train rams into temple, Gwalior mail Express train rams into temple, Express train injures six, Express train rams into temple injures six,

express train rams into a temple, six injured

ఆలయంలోకి దూసుకెళ్లిన రైలు.. ఆరుగురికి గాయాలు

Posted: 01/04/2015 01:44 PM IST
Express train rams into a temple six injured

మధ్యప్రదేశ్లో రైలు బీభత్సరం సృష్టించింది. బొగీలను అమర్చుకునేందుకు యార్డ్ కు చేరాల్సిన రైలు పట్టాలు తప్పి ఓ దేవాలయంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పూజారితో పాటు ఆరుగురు గాయపడ్డారు. గ్వాలియర్ రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. సంఘటన వివరాల్లోకి వెళ్తే.. గ్వాలియర్ రైల్వే స్టేష్టన్ లో నుంచి బయలుదేరాల్సిన రైలు బొగీలను కలుపుకునేందుకు అటాచ్ యార్డ్కు వెళ్లింది. అక్కడికి సరిగ్గా వెళ్లడంలో విఫలమైన రైలు పట్టాలను తప్పి పక్కనే వున్న ఆలయంలోకి దూసుకెళ్లింది. దీంతో ఆలయ పూజారి రామ్ నివాస్ శర్మతో పాలు ఆలయంలో వున్న ఐదుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ప్రత్యక్ష సాక్షులు మాత్రం గ్వాలియర్ మెయిల్ ఎక్స్ప్రెస్ రైలు నేరుగా ఆలయంలోకి దూసుకెళ్లిందని చెబుతుండగా, రైల్వే పోలీసులు మాత్రం రైలు ముందుగా చెట్టును ఢీ కొనిందని, ఆ తరువాత ఆలయంలోకి వెళ్లిందని చెబుతున్నారు. ఈ ఘటనతో ఆలయం పూర్తిగా ధ్వంసమైందని చెబుతున్నారు. రైలును నిర్లక్ష్యంగా నడిపించి.. ఆలయ ధ్వంసానికి కారణమైన డ్రైవర్ ను తక్షణం సస్పెండ్ చేయాలంటూ రైల్వే కార్మికులు స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. బాధితులకు నష్టపరిహారం చెల్లించి ఉచితంగా వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Express train ram  temple  Madhya Pradesh  six injured  

Other Articles