నూతన సంవత్సరాన్ని స్వాగతించేందుకు అందరి మాదిరిగానే వాళ్లు కూడా సిద్దమయ్యారు. చిన్నపాటి మైక్ సెట్ తెచ్చుకున్నారు. సరిపడా మద్యాన్ని ముందుగానే తెచ్చుకున్నారు. అందకు మంచిగ్ గా మంచి మంచి శాఖాహారాలు, మాంసాహాలతో కూడిన ఐటమ్స్ రెడీ చేసుకున్నారు. తీరా ఎప్పుడెప్పుడు చీకటి పడుతుందా అన్నట్టుగా వారంతా ఎదురుచూశారు. వారికి కావాల్సిన చందర్ రావు (చంద్రుడు) రానే వచ్చాడు. అంతే ఇక మద్యాన్ని ఒంట పట్టించేందుకు వారంతా తీవ్రంగా కుస్తీ పడ్డారు. ఇప్పుడు కూడా వారు మరో ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారు. అదే టైమ్ సరిగ్గా చీకటి పడింది. అక్కడి వారంతా వారి వారి సంబరాల్లో మునిగి తేలుతుండగా, ఇక వీరి స్తానికులను మోరెత్తించే పాటలు, అందుకనుగూణంగా చిందులు వేశారు. ఇంతకీ వారెవరో తెలుసా..?
తార్నాకలోని మౌలాలి అగ్నిమాపక కేంద్రంలో సిబ్బంది. నూతన సంవత్సర వేడుకల సందర్బంగా అగ్నిమాపక కేంద్రంలోని ఫైర్ మెన్లు అమరనాథ్, ఏ మల్లేష్, ఓం నమశ్శివాయలతోపాటు ఫైరింజన్ డ్రైవర్ వీరాస్వామి మందు వేశారు. అనంతరం పాటలు పెద్దగా పెట్టుకుని చిందేశారు. ఆ విషయాన్ని ఆగంతకులు ఫోటోలు తీసి.. మీడియా వారికి అందజేశారు. ఆ ఫోటోలు ఇప్పుడు మీడియాలో హల్చల్ చేశాయి. ఈ ఘటనపై వివరణ కోరేందుకు మీడియా ప్రతినిధులు మౌలాలి అగ్నిమాపక కేంద్రం ఉన్నతాధికారి చంద్రశేఖర్ను సంప్రదించేందుకు ప్రయత్నించాగా అతనితో పాటు మందేసి చిందేసిన సదరు నలుగురు మందుబాబుల సెల్ఫోన్లు కూడా మూగబోయాయి. నగరమంతా నూతన సంవత్సర వేడుకల్లో ఉండగా ఎక్కడైనా అగ్నిప్రమాదం సంభవిస్తే... తమను రక్షించేది ఎవరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నూతన సంవత్సర వేళను ఎంజాయ్ చేయడంలో తప్పులేదని, అయితే బహాటంగా తమ కార్యాలయాల్లో, అదీనూ విధుల్లో వుండగా చేయడం ఎంత వరకు సమంజసమో వారే నిర్ణయించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more