ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏసియాకు చెందిన ఒక విమానం అదృశ్యమైంది. ఇండోనేషియాలోని సురబాయా పట్టణం నుంచి సింగపూర్ కు బయల్దేరిన ఈ విమానం కొద్ది సమయం పాటు ట్రాఫిక్ కంట్రోల్ రూంతో సంబంధాలు కొనసాగించింది. ఆ తర్వాత ఉన్నట్టుండి ట్రాఫిక్ కంట్రోల్ బేస్ తో సంబంధాలు తెగిపోయాయి. సమీపంలోని ఏ విమానాశ్రయాల బేస్ కంట్రోల్ రూంలు ఈ విమానం సిగ్నల్ ను గుర్తించలేకపోతున్నాయి. ఉదయం 8.30కే సింగపూర్ రావాల్సి ఉండగా సరిగ్గా గంట ముందుగా సంబంధాలు కట్ అయ్యాయి. దీంతో విమానం తప్పిపోయిందని ఎయిర్ ఏసియా ప్రకటించింది.
తప్పిపోయిన విమానం నంబర్ QZ8501. ఇందులో సిబ్బంది సహా 162మంది ఉన్నారు. వీరిలో అత్యధికంగా 149మంది ఇండోనేషియన్లు ఉన్నారు. ముగ్గురు కొరియన్లు, సింగపూర్, బ్రిటన్, మలేషియా ప్రయాణీకులు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. అత్యధికులు ఇండోనేషియా ప్రయాణీకులు ఉండటంతో ఆ దేశ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. విమానం వెతికేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. సమీప దీవులకు చెందిన దేశాలకు కూడా సముద్ర జలాల్లో వెతుకులాట ప్రారంభించాలని కోరింది.
విషాదం తప్పదా..?
ఈ మద్య తప్పిపోయిన మలేషియన్ విమానాలు ప్రమాదానికి గురి కావటంతో ఈ విమానం కూడా ప్రమాదానికి గురయి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే నిజమయితే ఈ ఏడాది చివర్లో మరో విషాదం నెలకొన్నట్లు అవుతుంది. తాజా విమాన అదృశ్యంతో ఎయిర్ ఏసియా ఇతర సర్వీసులకు టికెట్లు బుక్ చేసుకునే వారి సంఖ్య కాస్త తగ్గింది. అయితే విమానం ప్రమాదానికి గురయినట్లు ఇప్పడు చెప్పలేమనీ.., ప్రయాణీకుల సంబంధీకులు దిగులు చెందవద్దని ఎయిర్ ఏసియా చెప్తోంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more