ఉగ్రవాదంపై గత ప్రభుత్వం సరిగా స్పందించటం లేదని ఎన్నికల సమయంలో నరేంద్రమోడి ప్రచారం చేశారు. దేశంలో ఉగ్రవాద దాడులు పెరుగుతున్నా.., యూపీఏ పట్టించుకోవటం లేదన్నారు. అయితే మోడి అధికారంలోకి వచ్చాక.., ఈ ఉగ్రవాదంపై ప్రపంచ దేశాల సదస్సుల్లో ప్రసంగిస్తున్నారు తప్ప, దేశంలో పెద్దగా చేసిందేమి లేదు. తాజాగా అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అంశం తెరపైకి వచ్చింది. దావూద్ పాక్ లోనే ఉన్నాడని అంతేకాకుండా.., భారత్ కూడా గతంలో పట్టుకునేందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చిందని ఓ విదేశీ నిఘా సంస్థ వెల్లడించింది.
ఇది గత ప్రభుత్వ హయాంలో జరిగిందని స్పష్టం అవుతోంది. యూపీఏ పై విమర్శలు చేసిన బీజేపీ.., తన ప్రభుత్వం మిస్టర్ క్లీన్, ఉగ్రవాదులను అణిచివేస్తుందని చెప్పుకునేందుకు వెంటనే రంగంలోకి దిగింది. దావూద్ ను అప్పగించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు పాక్ ను కోరాడు. దావూద్ కరాచీలో ఉన్నట్లు ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. ఈ ఆధారాలను కూడా పాక్ కు పంపామని చెప్పారు.
మోడి సర్కారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బాగానే పనిచేస్తుందని ఈ ఘటన స్పష్టం చేస్తుంది. అయితే సరిగ్గా నిఘా సంస్థ వివరాలు వెల్లడించిన తర్వాతే ఎందుకు స్పందించారు? ఆధారాలు ఉంటే మాఫియా ఢాన్ ను అప్పగించాలని పాక్ ను ముందే కోరవచ్చు కదా అని అనుమానాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశంపై చర్చ జరుగుతుంది కాబట్టి.., ప్రభుత్వం మిస్టర్ క్లీన్ అన్పించుకునేందుకు ప్రకటన చేశారని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రతి విషయాన్ని ప్రచారం కోసం వాడుకోవటం అంటే ఇదేనేమో. అయితే అదృష్టవశాత్తు మోడి సర్కారు వచ్చాక దేశంలో ఉగ్రవాద దాడులు తగ్గాయి. ఇది ఎన్డీయే గొప్పతనమా.., లేక తీవ్రవాదులు అదునుకోసం ఎదురుచూస్తున్నారా తెలియదు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more