అణు పరీక్షలకైన, ఆర్ధిక రంగ సంస్కరణలకైన ఒక నూతన ఒరవడిని సృష్టించటం నుండి.., రాజకీయాల్లో ఒక సరికొత్త అధ్యాయం తెర లేపటం వరకు.., ఎన్నో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన రాజకీయ భీష్మ పితామహుడు.., ఆజన్మ బ్రహ్మచారి శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయ్ గారికి అత్యున్నత పురస్కారం అయిన "భారత రత్న" ప్రకటించటం నిజంగా భారతీయులందరికీ గర్వ కారణం... ప్రపంచమంతా అణ్వాయుధాలు కలిగి ఉండి, మన భారత్ ఎటువంటి ఆయుధాలను నమ్ముకోలేక తన సొంత శక్తి పై ఆధార పడి ఉన్న దశలో భారత సైన్యానికి ఒక గొప్ప శక్తి ని ప్రసాదించే విధంగా, వారిలో ఆత్మ విశ్వాసం నింపేలా..., ఒక గొప్ప శాస్త్ర వేత్త ఆధ్వర్యం లో అణు పరిక్షలు నిర్వహించి శాంతి కాముక దేశమైన మన దగ్గర కూడా ఎవరినైనా ఎదుర్కొనే సత్తా ఉందని.., మన శత్రు దేశాలకు పరోక్షంగా హెచ్చరికలు పంపి వాళ్ళలో ముచ్చెమటలు పట్టేలా చేసిన యోధుడు శ్రీ వాజ్ పేయ్. అలాంటి వ్యక్తికి ఈ రోజు మనం అత్యున్నత పురస్కారంతో సత్కరించుకోవటం నిజంగా మనదరికి గర్వకారణమే.. అందుకే ఈ రోజు రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీ లన్ని ఆయనకు ఈ పురస్కారం ఇవ్వటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
త్యాగాలకు మారుపేరై నిలిచి, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని.., మనకు స్వేత్చ ను ప్రసాదించటానికి తన స్వేత్చను కోల్పోయి ఎన్నో ఆటుపోట్లను అవలీలగా ఎదుర్కొని తన దేశం కోసం, తన భావి తరాల భవిష్యత్ కోసం తెల్ల దొరలపై పోరాడి బానిస సంకెళ్ళ నుండి విముక్తి కల్పించి.. మనకు స్వతంత్రం సంపాదించి పెట్టిన మదన్ మోహన్ మాలవ్యకు ఈ రోజు అత్యున్నత పురస్కారం ఇవ్వటం మన దేశాన్ని మనం సత్కరించుకున్నట్లే అవుతుందేమో. దేశం కోసం వారి త్యాగాలు అనుపమనీయం. అలాంటి వారిద్దరికీ ఈ రోజు "భారత రత్న" అనే పురస్కారం ద్వారా సత్కరించుకోవటం దేశానికే అద్వితీయమైన, అరుదైన రోజు. ఆ మహానీయులిద్దరికి తెలుగు విశేష్ హృదయపూర్వక అభినందనల మందార మాల....!!
హరికాంత్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more