గత ఏడాది నుంచి వరుస పరాజయాలను చవిచూస్తున్న కాంగ్రెస్ పార్టీకి.. ఎట్టకేలకు ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్రను పోషించే స్థాయికి చేరుకుంది. తాజాగా జరిగిన జమ్మూకాశ్మీర్, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడ్డాయి. ఈ ఎన్నికల ఫలితాలలో జార్ఖండ్ లో ఘోర పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్ కాశ్మీర్ లో మాత్రం 12 స్థానాలతో నాల్గవ స్థానంలో కోనసాగింది. అయితే పిడీపి పార్టీ అత్యధికంగా 28 స్థానాలను సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించగా, బీజేపి 25 స్థానాలతో రెండో స్థానంలో కొనసాగింది. 15 స్థానాలతో నేషనల్ కాన్ఫరెన్స్, 12 స్థానాలతో కాంగ్రెస్ తరువాత స్థానాలను అక్రమించాయి. అయితే మొత్తం 87 స్థానాలున్న అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీకి లభించకపోవడంతో.. ఇతర పార్టీల మద్దతు తప్పని సరైంది.
ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుకు తాము పీడీపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్దమని కాంగ్రెస్ ముందుకు వచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం పీడీపీకి వస్తే మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్ ప్రకటించారు. గతంలో పీడీపీ, నేషనల్ కాన్ఫెరెన్స్ తో జట్టు కట్టిన విషయాన్ని ఆయనీ సందర్భంగా గుర్తు చేశారు. జమ్మూకాశ్మీర్ లో మతచాంధాస పార్టీలను పక్కన బెట్టేందుకు ఏదేని లైకిక పార్టీలతోననా తాము జత కట్టేందుకు సిద్దమని వెల్లడించారు. బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ తాము కలవబోమని స్పష్టం చేశారు. పీడీపీ కోసం తమ పార్టీ తలుపులు తెరిచివున్నాయని చెప్పారు. ప్రస్తుతం పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నిర్ణయం తీసుకోవాల్సి వుందని, కాశ్మీర్ లో మతవాదులను అడ్డుకునేందుకు తమతో జతకట్టేందుకు పిడీపీ సిద్దమో లేదో తేల్చుకోవాల్సిని ఆయన సూచించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more