‘నేను మీ బ్యాంక్ లో దొంగతనానికి వచ్చాను. మీ కుర్చీలో కూర్చొనే ఈ లెటర్ రాస్తున్నాను. నేను స్వతహాగా దొంగను కాను, పీకల్లోతు కష్టాల్లో వుండి మాత్రమే తాను దొంగతనానికి సాహసించాను. నాకు ఎదిగిన పిల్లలు వున్నారు. అధిక ధరలు, పెరుగుతున్న ధరాఘాతం నన్ను తీవ్రంగా బాధిస్తుంది. దీనికి తోడు నాకున్న ఓ చిన్న ఉద్యోగం కూడా ఇటీవల పోయింది. అందుకనే నేను మీ బ్యాంకుకు కన్నం వేయడానికి వచ్చాను’ అంటూ ఓ దొంగ తన అవేదనను వెలిబుచ్చాడు. మీ బ్యాంకుకు కన్నం వెయడానికి వచ్చనందుకు నన్న మన్నించండీ అంటూ తన లేఖలో బ్యాంకు అధికారులను కోరాడు. అదీనూ బ్యాంక్ లెటర్ ప్యాడ్ తీసుకుని దానిపై తన మనోవేదనను వెలిబుచ్చుతూ లేఖ రాశాడు.
ఈ చిత్రమైన ఘటన దేశ రాజధాని ఢిల్లీకి చేరువలో వున్న నోడియా పట్టణంలోని సెక్టార్ 6లో వున్న కెనరా బ్యాంకు బ్రాంచ్ లో చోటుచేసుకుంది. సోమవారం బ్యాంకు సమయానికి చేరుకున్న అధికారులు తలుపులు తెరచి వుండటం చూసి పోలీసులకు పిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అన్వేషించగా, బ్యాంకు అధికారులకు దొంగ రాసిన లేఖ లభించింది. పోలీసులు జాగిలాలను రంగంలోకి దింపినా ఫలితం లేకపోయింది. దొంగ ఆచూకీ కోసం సిసి టీవీ కెమెరాలను కూడా అన్వేషించామని, అతను అందులో ఏమైనా చిక్కాడేమోనని వెతికామని పోలీసులు చెప్పారు.
కాగా దొంగ బ్యాంకుకు కన్నెం వేసేందుకు వచ్చాడే కానీ.. అది చేయడంలో తాను విపలమయ్యాడని పోలీసులు నిర్థారించారు. దొంగ రాసిని లేఖ నిజమే అయ్యే అవకాశాలు వున్నాయని, పోలీసులు బావిస్తున్నారు. కంప్యూటర్లు, డాక్యూమెంట్లు, స్ట్రాంగ్ రూమ్ సహా లాకర్లు అన్ని పథిలంగానే వున్నాయని చెప్పారు. ప్రధాన ద్వారం వద్ద పైకప్పును నుండి లోపలికి చొరబడ్డ దొంగ బయటకు వెళ్లే క్రమంలో కిటీకీని ధ్వంసం చేసి వెళ్లాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే లేఖ నిజమన సంబర్భంలో కొత్త వ్యక్తులు కూడా బ్యాంకులోపలకి సునాయసంగా చొరబడగలుగుతున్నారని, బ్యాంకు భద్రతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. నోడియా పోలీసులు నిఘా వ్యవస్థ వైపల్యంపై కూడా పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more