భారత ధౌత్యాధికారిణి దేవయాణి కోబ్రాగదే మరో సారి వార్తల్లో నిలిచింది. అమెరికాలో పనిమనిషిని అనుమతి లేకుండా తీసుకెళ్లిన ఘటనపై అగ్రరాజ్యం పోలీసులు అమెను అరెస్టు చేసి వివస్త్రను చేసి తనిఖీలు చేశారన్న వార్తల నేపథ్యంలో యావత్ భారతం అగ్రరాజ్యం దాష్టికం పై కన్నెర చేసిన క్రమంలో వినిపించిన పేరు దేవయాణి కోబ్రాగాదె. అయితే అమె మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సారి అమె తన అధికార హోదాను, సర్వీసు రూల్స్ ను మరచి మీడియాతో పలు అంశాలపై చర్చించారనన్న నేపథ్యంలో భారత విదేశాంగ వ్యవహరాల శాఖ అమెను విధుల నుంచి తప్పించి.. నిరీక్షణలో వుంచింది.
అయితే తాను మాత్రం మీడియాతో మాట్లాడిన అంశాలపై ఎలాంటి సర్వీసు రూల్స్ ను ఉల్లంఘించలేదని దేవయాణి తెలిపింది. తాను మీడియాతో మాట్లాడిన ప్రతి అంశం సివిల్ సర్వీసు రూల్స్ 1964 సెక్షన్ 9కి లోబడినట్టు తెలిపింది. భారత విదేశాంగ వ్యవహరాల శాఖ దేవయాణిని విధుల నుంచి తప్పించి నిరీక్షణలో వుంచిన నేపథ్యంలో ఈ వ్యవహారాం బయటకు వచ్చింది. అమెరికాలో భారత డిఫ్యూటీ కౌన్సిల్ జనరల్ గా వున్న దేవయాణిని అమెరికాలో తన పనిమనిషికి తక్కువ వేతనం ఇవ్వడంతో పాటు పాస్ పోర్టులో తనకు ఇచ్చే వేతనాన్ని ఎక్కువగా చేసి చూపినందుకు గాను అమెను అమెరికాలోని న్యూయార్క్ పోలీసులు గత డిసెంబర్ లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ అంశం తీవ్ర సంచలనం రేపడంతో పాటు అప్పటి అమెరికా దౌత్యాధికారిణి నాన్సి పావెల్ రాజీనామాకు కూడా దారి తీసింది.
అప్పట్లో తనపై అమెరికా మోపిన కేసులన్నీ అక్రమంటూ భారత్ కు తిరిగివచ్చి, అక్కడి నుంచి ఐక్యరాజ్యసమితికి వెళ్లిన దేవయాణి.. ఈ కేసుకు సంబంధించి మీడియాతో చెప్పిన విషయాలు చర్చనీయాంశంగా మారి ఇప్పుడు అమె పదవికే ఎసరు పెట్టేలా చేశాయి. తన ఇద్దరు పిల్లలకు అమెరికా పాస్ పోర్టులు వున్నాయని, వారు అక్కడే జన్మించారని, వారిని అమెరికా పౌరులుగానే చూడాలన్న విషయాన్ని దాయడం మొత్తానికే ఎసరు తెచ్చింది. అయితే అమెను భారత విదేశాంగ శాఖ ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్ లో పెట్టిన విషయాన్ని విదేశాంగ శాఖకు చెందిన అధికారులు అనధికారికంగా దృవీకరించారు. ప్రస్తుతం దేవయాణిపై పరిపాలనపరమైన విచారణను అదేశించినట్లు కూడా తెలిసింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more