ఒకరు శాసన సభ మాజీ సభ్యుడు అదీ కాకా సమాజం లో ప్రజల్లో పేరొందిన నేత సుపుత్రుడు కూడా..!! ఇంకొకరు ప్రస్తుత శాసన సభ సభ్యుడు. ఇద్దరు కలిసి ఇటీవల జరిగిన ఒక వివాహ కార్యక్రమంలో బాహాబహి కి దిగారు. ఈ విషయం కాంగ్రెస్ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఇద్దరూ పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు కూడా. దాంతో ఇద్దరి పైన దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సి.సి టి.వి పుటేజిలు, 37 మంది ప్రత్యక్ష సాక్షుల విచారణ అనంతరం పోలీసులు విష్ణుకు నోటీసులు జారీ చేశారు. సి.సి టి.వి పుటేజిలు, 37 మంది ప్రత్యక్ష సాక్షులు జరిగింది చెప్పక పోలీసులు వంశీ చంద్ రెడ్డి పై దాడికి దిగినట్లు గుర్తించారు. దాంతో పోలీసులు నోటిల్సు లు ఇవ్వాల్సి వచ్చింది.
మొదటి నుండి విష్ణు ప్రవర్తన కొంత వివాదాస్పదంగానే ఉండేది. 2007 లో ఆయన వై ఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడి కుటుంబం పై దాడి కి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయాన్ని ఎం.ఎల్.ఏ వంశీచంద్ రెడ్డి విలేకరుల ముందు కూడా చెప్పాడు. అప్పుడు ఏదో పార్కింగ్ విషయం లో తలెత్తిన తగాదా చివరికి చిలికి చిలికి గాలివాన అయ్యింది. స్వయంగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వై.ఎస్ ఏ జోఖ్యం చేసుకోవాల్సి వచ్చిందని చెప్తారు. అప్పుడే విష్ణు వివాదాస్పద వైఖరి బాహ్య ప్రపంచానికి తెలిసింది. తర్వాత ఎన్నో సందర్భాల్లో ఎం.ఎల్.ఏగా ఉన్నప్పుడు కూడా పలు అధికారులతో గొడవ పడ్డట్లు కొన్ని వర్గాలు చెప్తాయి. తన తండ్రి చనిపోయిన తర్వాత మొదటిసారి పి.జె.ఆర్ కొడుగ్గా 2009 సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొని గెలిచాడు. తర్వాత మళ్ళి ఇటీవల జరిగిన ఎన్నికలలో పోటి చేసి ఓడిపోయాడు. ఇప్పుడు విష్ణు సోదరి విజయా రెడ్డి తెరాస పార్టీ లో ఉండటం గమనార్హం. ఒకప్పుడు పి.జె.ఆర్ కొడుగ్గా ప్రజాభిమానం చూరగొన్న విష్ణు తర్వతాతర్వాత ప్రజల్లో.., తండ్రి అడుగుజాడల్లో నడవలేకపోయాడనే విమర్శలు ఉన్నాయి. ఏది ఏమైనా పేద ప్రజల హృదయాలలో ఇప్పటికి కొలువున్న పి.జె.ఆర్ కొడుగ్గా కొన్ని భాద్యతలు ఉంటాయని ఆ నేత గుర్తేరెగాలని కొన్ని వర్గాలు కోరుకుంటున్నాయి.
హరి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more