తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కలసి రామోజీ ఫిల్మ్ సిటీలో పర్యటించడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. టీడీపీ పార్టీ నుంచి నేతల వరకు ఎవరన్నా అసలు గిట్టని వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ పార్టీకి జవసత్వాలు అందించడంలో తన వంతు తోడ్పాటును అందించిన ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుల మధ్య ఎలా సయోధ్య కుదిరిందని అందర విస్తుపోతున్న తరుణంలో.. సాగిన ఈ భేటీ వెనుక అసలు రహస్యాలు అనేకం వున్నట్లు స్పష్టమవుతోంది.
తెలంగాణలో పత్రికా, మీడియా సహా అనేక వ్యాపారాలు సాగిస్తూ తన వాణిజ్య సామ్రాజ్యాన్ని విస్తరించిన రామోజీరావు కేసీఆర్ తో కేవలం తన వ్యక్తిగత వ్యవహారాలకు మాత్రమే పిలిపించుకున్నారని తెలుస్తోంది. తన భూములు, వ్యాఫారాలను పరిరక్షించుకోవడంలో ఓ అడుగు వెనక్కు వేసినా.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో వున్నంత వైరం కేసీఆర్ తో లేకపోవడంతో.. ముందడుగు వేశారని వ్యాపారవర్గాల టాక్. అయితే రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరి నుంచి అన్ని వ్యాపారాలకు కేసీఆర్ అండగా వుంటారన్న ధీమాతోనే ఆయనతో రామోజీరావు కలసినట్లు తెలుస్తుంది.
ఇదిలావుండగా, తెలంగాణలో రెండు వేల ఏకరాల్లో మరో ఫిల్మ్ సిటీని నిర్మిస్తామని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే కేసీఆర్ ప్రకటించడం.. అంతలో ఇద్దరి మధ్య భేటీ జరగడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం నిర్మంచ తలపెట్టిన ఫిల్మ్ సిటీని వాయిదా వేసుకోవాలని రామోజీ కేసీఆర్ కు విన్నవించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఫిల్మ్ సిటీ నిర్మాణం చేపడితే.. తాన ఫిల్మ్ సిటీకి ప్రేక్షకుల తాకిడి తక్కువతుందని, ఈ క్రమంలో వాయిదా వేసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఒకవేళ ఫిల్మ్ సిటీ నిర్మించ తలపెడితే రంగారెడ్డి జిల్లాలో తన ఫిల్మ్ సిటీ పక్కనే నిర్మిస్తే ఉభయ కులశోపరిగా వుంటుందని కూడా రామోజీ కేసీఆర్ కు హితవు పలికారని సమాచారం.
అయితే అటు ఫిల్మ్ సిటీ వర్గాలతో పాటు ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్మించనున్న ఫిల్మ్ సిటీ రామోజీ ఫిల్మ్ సిటీకి ధీటుగా వుండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ యోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం రంగారెడ్డి జిల్లాలోని రాచకోండ గిరులపై కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహించారు. తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి సినిమా, క్రీడా నగరాలను నిర్మిస్తామని.. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల పరిధిలో ఉన్న రాచకొండ గుట్టల ప్రాంతం ఇందుకు అనువుగా ఉన్నట్లు గుర్తించామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ప్రకటించారు. ఇక్కడ లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశముందని చెప్పారు. హైదరాబాద్ నుంచి రాచకొండకు రెండు మార్గాల్లో నాలుగు లేన్ల రోడ్డును నిర్మిస్తామని చెప్పారు. ఈ మేరకు రాచకొండ గుట్టల ప్రాంతంపై సోమవారం మంత్రులు మహేందర్రెడ్డి, జగదీశ్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో కలిసి సీఎం ఏరియల్ సర్వే చేశారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more