దేశ రాజధానిలో మరో దారుణం జరిగింది. నిర్భయ ఉదంతం అనంతరం కఠిన చట్టాలు తెచ్చినా, దేశ రాజధానిలో పాలకులు మారిని ఆడవాళ్లపై జరుగుతున్న అత్యాచారాలకు అడ్డుకట్ట పడటం లేదు. ఒంటిరిగా మహిళలు కనబడితే.. చాలు వారిపై మగ మృగాళ్లు దాడులు శృతి మించిపోతున్నాయి. మహిళలపై ఆగడాలు ఆగడం లేదు. హస్తినలో మరో అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. శుక్రవారం రాత్రి మహిళా ఉద్యోగిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై పిర్యాదు చేయాలా వద్దా అన్న సందిగ్ధంలో పడిన బాధితురాలు ఎట్టకేలకు ధైర్యం చేసి పోలీసులకు పిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
గుర్గావ్లో ఓ ఫైనాన్స్ సంస్ధలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి విధులు ముగించుకున్నఅనంతరం స్నేహితులతో కలసి అక్కడే స్థానికంగా గల ఓ హోటల్ లో భోజనం చేసింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో తన ఇంటికి వెళ్లడానికి ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన క్యాబ్ను మిత్రులతో కలసి అద్దెకు తీసుకున్నారు. అయితే అందరి ఇళ్లు దెగ్గర కావడంతో అందరు మిత్రులు వారి వారి గమ్యస్థానాల వద్ద దిగి వెళ్లారు. బాధితురాలి ఇళ్లు అక్కడి నుంచి కొంచెం దూరంగా వుండటంతో అమె ఒక్కతే చివరకు క్యాబ్ లో వుండిపోయింది.
అఫీసులో పని ఒత్తడికి తోడు బోజనం కూడా చేసిన బాధితురాలు కారులోనే నిద్రలోకి జారుకుంది. ఈ క్రమంతో తనను ఎవరో బంధించినట్లు అనిపించి లేచి చూసే సరికి క్యాబ్ డ్రైవర్ తనను బంధించి, వివస్త్రను చేస్తున్నాడని గమనించింది. కారును నిర్మానుష్య ప్రాంతంలో ఆపిన క్యాబ్ డ్రైవర్ తనపై అత్యాచారానికి ఒడిగడుతున్నాడని తెలుసుకుని వారి ప్రతిఘటించే ప్రయత్నం చేసింది. డ్రైవర్ మహిళా ఉద్యోగిని బంధించి అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని ఆమెను బెదిరించాడు. ఆమెను ఇంటి సమీపంలో వదిలి వెళ్లిపోయాడు. ఆ సయమంలో బాధితురాలు కారు నెంబర్ ప్లేట్ను ఫోటో తీసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. క్యాబ్ కంపెనీని, నిందితుడిని గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more