రాజధానిలో మరో దారుణం చోటు చేసుకుంది. నగరంలో మహిళలపై స్నేక్ గ్యాంగ్ దురాగతాలు మరచిపోక ముందే శివార్లలో ఇలాంటి దారుణమే మరోటి చోటుచేసుకుంది. ఢిల్లీలో నిర్భయ ఘటన తరహాలో... స్నేహితుడితో కలిసి సంఘీ ఆలయానికి వెళ్తున్న ఓ యువతిపై మృగాళ్లు పైశాచికత్వం ప్రదర్శించారు. బెదిరించి మరీ సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. నగర శివార్లలోని హయత్ నగర్ పెద్దఅంబర్పేట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. నగరానికి చెందిన 22 ఏళ్ల యువతి... తన స్నేహితునితో కలిసి ఆ ప్రాంతానికి వచ్చింది. వారిద్దరే ఉండటాన్ని గమనించిన శ్రీనివాసరెడ్డి, లింగారెడ్డి అనే యువకులు వారి వద్దకు వెళ్లారు.
తాము పోలీసు ఇన్ఫార్మర్లమని చెప్పి అటకాయించారు. పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లారు. నిర్మానుష్య ప్రాంతం కావడంతో అటుగా ఎవరూ రారని నిర్ధారించుకున్న దుండగులు... ఆ యువకుడిని కొట్టి, ఆమె స్నేహితురాలిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. అనంతరం ఆమె నుంచి ఫోన్ నంబరు తీసుకున్నారు. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న చిత్రాలను మొబైల్ లో వీడియో తీశామని, అదీకాక అకృత్యాల దృశ్యాలను కూడా షూట్ చేశామని చెప్పారు. తాము ఎప్పుడు పిలిచినా రావాలనీ... లేకుంటే తమ మొబైల్ లో వున్నా చిత్రాలను ఇంటర్ నెట్ లో అప్ లోడ్ చేస్తామని బెదింరించారు. పోలీసులకు చెబితే చిత్రాలను బయటపెట్టి పరువు తీస్తామని గట్టిగా హెచ్చరించారు.
వారి తీరుతో తీవ్ర భయాందోళనలకు గురైన యువతీ పోలీసులను ఆశ్రయించకుండా ఇంటికి వెళ్లింది. పోయారు. ఆ మరుసటి రోజే యువతికి ఫోన్చేసి తమ దగ్గరికి రావాలని బెదిరించారు. నిందితుల నుంచి వరుసగా ఫోన్ కాల్స్ రావడంతో ఆమె హయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా ఈ ఘటనపై ఏసీపీ బాస్కర్ స్పందించారు. ఆ జంట ఏకాంతంగా ఉన్న సమయంలోనే ఇద్దరు వ్యక్తులు వారిని సెల్ ఫోన్ లో చిత్రీకరించిన అనంతరం బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. ఈ క్రమంలోనే ఆ యువతి కూడా వచ్చిన యువకుడు పారిపోయాడని తెలిపారు. దీంతో ఇద్దరు నిందితులు అత్యాచారానికి ఒడిగట్టారన్నారు.
తొలుత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి భయపడిందని.. ఆ తరువాత ఆమె ఫిర్యాదుతోనే కేసు నమోదు చేశామన్నారు. ఆ నిందితుల నుంచి సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రస్తుతం సెల్ ఫోన్ ను ఫోరెనిక్స్ ల్యాబ్ కు పంపామని.. ఆ నివేదిక వచ్చాక చార్జిషీట్ దాఖలు చేస్తామన్నారు. ఆ నిందితులు పెద్ద అంబర్ పేటకు చెందిన వెల్డర్ నల్లబోను శ్రీనివాస్ రెడ్డి, మెకానిక్ బండి లింగారెడ్డిలుగా గుర్తించామన్నారు. వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశామని ఏసీపీ భాస్కర్ తెలిపారు.
‘మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి మా కోరిక తీర్చాలి, లేకుంటే నీ ఫొటోలు ఇంటర్నెట్లో పెడతాం’ అని బెదిరించారు. నిందితులిద్దరినీ పెద్దంబర్పేటకు చెందినవారిగా గుర్తించారు. ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఫోన్లో చిత్రీకరించిన దృశ్యాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వీటిని ఎవరికైనా పంపారా అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. బాధిత యువతిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more