విశ్వవ్యాప్తంగా ‘ఐఫోన్’ క్రేజీ ఎంతమేరకు వుందో అందరికీ తెలిసిందే! చిన్నపిల్లల నుంచి పెద్ద వయస్కులవారు ఈ మొబైల్ ఫోన్’ను కొనుగోలు చేసుకోవడం కోసం వెంపర్లాడుతున్నారు. అలాంటి ఈ ఐఫోజ్ మోజు ఓ ఆరేళ్ల పిల్లాడి ప్రాణాన్నే బలితీసుకుంది. నిజానికి ఆ పిల్లాడికి, ఐఫోన్’కి ఎటువంటి సంబంధం లేదు. అసలు విషయమేంటో మేటర్’లోకెళ్లి తెలుసుకుందాం!
సెంట్రల్ ఢిల్లీలోని రంజిత్నగర్కు చెందిన ఓ పండ్ల వ్యాపారి ఆరేళ్ల కొడుకు గణేష్ ఆడుకోవడానికి ఇంటినుంచి బయటికెళ్లాడు. అంతే! ఆ బాలుడు ఎంతకీ తిరిగి ఇంటికి రాలేదు. దాంతో అతని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో వుండగా.. సాయంత్రానికి వాళ్లకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. గణేష్ని కిడ్నాప్ చేశామని, విడిచిపెట్టాలంటే లక్షన్నర రూపాయలు ఇవ్వాలని కిడ్నాపర్ తెలిపాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని గణేష్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసుల స్పందించి రంగంలోకి దిగేసరికి దారుణం జరిగిపోయింది. సదరు కిడ్నాపర్ ఆ అబ్బాయిని చంపేసి, శవాన్ని ఓ పార్క్’లో పడేసి వెళ్లిపోయాడు.
గణేష్ మృతదేహాన్ని కనుగొన్న అనంతరం దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. వేగంగా తమ విచారణను ముగించేశారు. బాలుడు మృతిచెందడానికి ముందు ఎవరితో ఉన్నాడనే విషయంపై ఖాకీలు తమదైన శైలిలో దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆ వ్యాపారి ఇంటి సమీపంలోనే వుంటున్న ఇంటర్ చదివే 17 యువకుడితో గణేష్ చివరిసారిగా ఆడినట్లు వాళ్లు గుర్తించారు. దీంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అందరూ విస్తుపోయే సమాధాన్ని తెలిపాడు. తనకు ఎప్పటి నుంచో ఐఫోన్ కొనుక్కోవాలని ఉండేదని, ఆ కోరిక తీర్చుకోవడం కోసమే గణేష్ని కిడ్నాప్ చేసి లక్షన్నర డబ్బులు డిమాండ్ చేశానని పేర్కొన్నాడు. అయితే వ్యవహారమంతా ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో గణేష్’ని హతమార్చానని ఒప్పుకున్నాడు. ఆ యువకుడ్ని అరెస్ట్ చేసి జువైనల్ హోమ్కి తరలించారు. ఇలా ఈవిధంగా ఒకరి ఐఫోన్ మోజు కోసం అనవరసరంగా ఆరేళ్లబాలుడు బలైపోయాడు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more