నర హంతకుడు, నర రూప రాక్షసుడు, కసాయి, సైకో ఈ పేర్లన్ని అతడికి సరిగ్గా సరిపోలుతాయి. ఓంటరిగా వెళ్లే మహిళలను టార్గెట్ చేసి వాడి ఆభరణాలను కాజేసి.. సాక్షాలు లేకుండా వారి మృతదేహాలను దహనం చేసే వాడికి పెట్టడానికి ఈ పేర్లు కూడా సరిపోవు. కేవలం డబ్బు, నగల కోసమే ప్రాణాలను తీసిన కర్కోఠకుడిని ఎట్టకేలకు మెదక్ జిల్లా సిద్దిపేట పోలీసులు అరెస్టు చేశారు. మెదక్ జిల్లాలో సంచలనం రేపిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. అతడి పేరు సలీం.. పనిపాట లేకుండా తిరుగుతున్నాడు. తన విలాసాలు, దురలవాట్ల కోసం డబ్బు సంపాదించేందుకు ఎంచుకున్న మార్గం ఒంటరి మహిళలు.
గ్రామీణ ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్లే మహిళలను టార్గెట్ చేసుకుని వారి వద్ద నున్న బంగారు, వెండి ఆభరణాలను తీసుకునే వాడు. అందుకోసం వారిని హత్యమార్చేవాడు. అది చాలదన్నట్లు వారెవరన్నది..? ఎవరు చంపారన్నది తెలియకుండా మృతదేహాలను దహనం చేసేవాడు. మెదక్ జిల్లాలో సుమారు అయిగురు మహిళలను ఈ విధంగానే హత్య చేసి.. దహనం చేశాడు. ఆ మహిళలు ఎవ్వరనేది తెలుసుకోవడం కోసం పోలీసులు అనేక పాట్లు పడాల్సి వస్తోంది. కేవలం పగ, ప్రతీకారాలతో రగిలిపోయే వారే ఇలాంటి దారుణాలకు ఒడిగడతారని.. ఆ కోణంలోనే పోలీసులు విచారణ సాగిస్తారని మృతదేహాలను దహనం చేసినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు.
ఓంటరి మహిళలు ఎంతగా ప్రతిఘటించినా.. వారిని హత్య చేయవచ్చని, అందుకే వారిని ఎంపిక చేసుకున్నానని, వారి మెడలో వుండే మంగళసూత్రం, మెట్టలు, చెవి దుద్దులు, ఇతర బంగారు ఆభరణాలను కాజేయవచ్చనే తాను వారిని ఎంచుకున్నానని పోలీసుల విచారణలో తేలింది. గత ఆరు నెలలుగా ఐదుగురు మహిళలను హత్య చేసి.. తప్పించుకు తిరుగుతున్న నిందితుడు సలీం.. ఎట్టకేలకు సిద్దిపేట పోలీసులకు చిక్కాడు. నిందితుడి వద్ద నుంచి 13 తులాల బంగారం, వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సలీంతో పాటు హత్యలకు సహకరించిన మరో మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా హత్యగావించబడిన మహిళలు ఎవరనేది పోలీసులు ఆరా తీస్తున్నారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more