అభివృద్ధిలో దూసుకుపోతున్నామని చెప్పుకుంటున్న భారత్... ప్రపంచ దేశాల ముందు సిగ్గుతో తలదించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి అరవై ఏడు సంవత్సరాలు గడిచినా ఇంకా బానిస బతుకులు మాత్రం తగ్గలేదని ప్రపంచ నివేదిక నిగ్గు తేల్చింది. ఒకప్పుడు దేశానికి వచ్చిన తెల్లదొరలు భారతీయుల్ని బానిసలుగా చూశారు. అయితే ఇప్పుడు మాత్రం దేశం లోపల.., విదేశాల్లో కూడా దేశ ప్రజలు బానిసత్వ సంకెళ్లలో బందీలుగా ఉన్నారని ప్రపంచ బానిసత్వ సూచి తెలిపింది. ఇది చాలా బాధాకరమైన విషయం. 167దేశాల్లో జరిపిన సర్వేల వివరాలను ప్రపంచం ముందు పెట్టి ఈ కఠోర నిజాలను బయటకు చెప్పింది.
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో బానిసత్వ బ్రతుకులు, వారి జీవితాలు, దారితీసిన పరిస్థితులపై అధ్యయనం చేసిన సర్వే సంస్థ చేదు నిజాలు వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 0.5శాతం ప్రజలు బానిసలుగా ఉన్నారు. మారిటానియాలో ఎక్కువమంది ప్రజలు బానిసలుగా ఉన్నారు. అయితే దేశాల వారిగా చూస్తే మాత్రం భారతీయులే ఎక్కువగ బానిస బ్రతుకుల్లో మగ్గుతున్నారు. మన దేశంలో 1.4శాతం ప్రజలు బానిసలుగా ఉన్నారు. ప్రపంచ దేశాల స్థూల నివేదికతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. అంటే దేశంలో కోటి నలబై లక్షల మంది ప్రజలు బానిస బ్రతుకులు అనుభవిస్తున్నారు. ఇక మన తర్వాత పొరుగున ఉన్న చైనా ముప్పై లక్షల మంది బానిసలుగా ఉన్నారు. వాస్తవానికి భారత్ తో పోలిస్తే చైనా జనాభా ఎక్కువ అయినా సరే ఆ దేశ బానిసత్వ రేటు మనకంటే చాలా తక్కువగా ఉంది. దీన్నిబట్టే చైనాలో అమలవుతున్న విధానాలేమిటో అర్ధం చేసుకోవచ్చు.
దేశాల వారిగా బానిసత్వ లెక్కలు చూస్తే.., 4శాతం ప్రజల బానిసత్వంతో మారిటానియా తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత 3.9శాతంతో ఉబ్జెకిస్థాన్ రెండవ స్థానంలో ఉంది. ఇక 2.3శాంతో హతి, 1.36స్థానంలో ఖతార్ ఉంటే.., 1.14శాతంతో భారత్ ఐదవ దేశంగా గుర్తించటం జరిగింది. ఈ దేశాల్లో ప్రజలు ఎలా దోపిడీకి గురవుతున్నారు. బానిసత్వం అంటే బలవంతంగా పనిచేయించటంతో పాటు బాలకార్మిక వ్యవస్థ, మనుషుల అక్రమ రవాణా, బలవంతపు వ్యభిచారం, శ్రమదోపిడీలను పరిగణలోకి తీసుకుని జాబితా రూపొందించారు. ఇక ఐర్లాండ్, ఐస్ ల్యాండ్ దేశాల ప్రజలు కూడా చాలావంతు బానిసలుగా ఉన్నట్లు గుర్తించటం జరిగింది. వీరిలో చాలవరకు మంచి ఉద్యోగాలు, వేతనాలు ఉన్నాయని చెప్పి విదేశాలకు పంపించి అక్కడ ఇండ్లలో పని చేయించటంతో పాటు, వ్యభిచార వృత్తుల్లోకి బలవంతంగా లాగుతున్నారని తేల్చింది.
బలవంతపు పనులు చేయించటం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా 150 బిలియన్ డాలర్ల డబ్బు అక్రమంగా సంపాదిస్తున్నారట. ఇక చట్టాల అమలు విషయంలో ఆఫ్రికా దేశాలు సవాళ్లను ఎదుర్కుంటున్నాయి. సోమాలియా వంటి దేశాల్లో పలు తీవ్రవాద సంస్థలు చిన్న పిల్లలను తమ కార్యకలాపాల కోసం వినియోగించుకుంటున్నాయి. ఇక జాంబియా, అంగోలా, కాంగో వంటి దేశాల్లో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అత్యంత ప్రమాదకరమైన గనుల్లో పనులు చేయిస్తున్నారు. మనుషుల అక్రమ రవాణా విషయంలో నైజీరియా అగ్రస్థానంలో ఉంది. ఇక్కడి ప్రజలు ముఖ్యంగా మహిళలను రుణ బాండ్లు తీర్చేందుక గాను ఇటలీ వంటి దేశాలకు వ్యభిచార కార్యకలాపాల కోసం పంపిస్తున్నారు.
చట్టాలున్నా చర్యలు శూన్యం
బానిసత్వపు బ్రతుకుల్లో అగ్ర భాగాన ఉన్న ఆఫ్రికా దేశమైన మారిటానియాను తీసుకుంటే.., ఇక్కడ బానిసత్వ నిర్మూలన కోసం ప్రత్యేక చట్టాలు, ప్రత్యేక ట్రిబ్యునల్ ఉన్నాయి. అయితే వాటి అమలు మాత్రం ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. మార్చిలో ఏర్పాటైన ట్రిబ్యునల్ ఇంతవరకు ఒక్కకేసు కూడా విచారించలేదు అంటే వ్యవస్థ పనితీరు అర్ధం చేసుకోవచ్చు. ఇక ఉజ్బెకిస్తాన్ తీసుకుంటే పత్తి పంటకోసం మిలియన్ల సంఖ్యలో ప్రజలు కూలిలుగా మారుతున్నట్లు తెలుస్తోంది.
భారత్ విషయానికి వస్తే ఈ మద్య దేశంలో కఠిన చట్టాలు చేయటం జరిగింది. బానిసత్వంకు వ్యతిరేకంగా చట్ట సవరణలు చేయటంతో పాటు, మనుషుల అక్రమ రవాణా నిరోధక చట్టాలు కూడా కఠిన తరం చేయటం జరిగింది. ఫలితంగా గణనీయమైన పెరుగుదలకు బదులు ప్రస్తుతం బానిసత్వ రేటు కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే ఇతర దేశాలతో పోలిస్తే మాత్రం ప్రమాదకర స్థాయిలో ఉంది అని సర్వే సంస్థ వెల్లడిస్తోంది. ఇది ప్రతి భారతీయడు సిగ్గుపడాల్సిన సమయం. ప్రపంచంలోనే అత్యంత శక్తితంతమైన మానవ వనరులు కల్గిన దేశంగా గొప్పలు చెప్పుకునే మనం ఇలా బానిస బతుకులీడుస్తున్నామని లెక్కలు తేలుస్తున్నాయి.
అరవై సంవత్సరాలుగా ఎన్నో ప్రభుత్వాలు మారాయి. ఎందరో నేతలు వచ్చారు. కాని దేశ ప్రజల బ్రతుకులు మాత్రం మారటం లేదు. ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతుంటే పేదవాడు మాత్రం దారిద్ర్యం నుంచి బయటపడటం లేదు. తరతరాలుగా వీరు దారిద్ర్యంలోనే మగ్గుతున్నారు. చేయాలంటే పనులు లేక కొందరు బ్రతుకు వెల్లదీస్తుంటే.., అడిగేవారు లేదు కదా అని చాకిరీ చేయించుకుని చాలీచాలని వేతనాలు ఇస్తున్నా ఏమి చేయలేకపోతున్నారు. ఈ వ్యవస్థ మారాలంటే.., ప్రభుత్వం క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగాలి. నేతలు ప్రకటనలు చేసినట్లుగా కాదు.., అందర్నీ కలుపుకుని పోయి బానిసత్వ నిర్మూలన కోసం కృషి చేయాలి. లేకపోతే.., భారత దేశం అంటే బానిసల దేశంగా పేరు పొందే ప్రమాదం ఉంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more