కఠోరశ్రమ, ప్రణాళికాబద్ధ పాలన, పాలకుల చిత్తశుద్ధి వల్లే సింగపూర్ అబివృద్ధి సాధ్యమైందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా సింగపూర్ తరహాలో అభివృద్ది చేస్తానని చెప్పారు. అందుకోసం శ్రమించడానికి తాను సిద్దంగా వున్నానన్నారు. సింగపూర్ తరహాలోనే ఆంధ్రప్రదేశ్ లోనూ తలసరి ఆదాయం, జీడిపీ వృద్ది రేటు సమకూర్చేందుకు తాను శాయశక్తులా కృషి చేస్తానని చంద్రబాబు అన్నారు. సింగపూర్ తలసరి ఆదాయం మనకంటే 20 నుంచి 30 రెట్లు అధికంగా ఉందన్నారు.
తన సింగపూర్ పర్యటన విజయవంతం కావడానికి సహకరించిన అందిరికీ అభినందనలు తెలిపారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సింగపూర్ పర్యటన వివరాలను చంద్రబాబు వెల్లడించారు. మన జనాభాలో పదోవంతు ఉన్న సింగపూర్ జీడీపీ 4 రెట్లు ఎక్కువగా ఉందన్నారు. సింగపూర్ జీడీపీ 300 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు. సింగపూర్కు మనకంటే చాలాకాలం తర్వాత స్వాతంత్య్రం వచ్చినప్పటికీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి సాధించగలిగారన్నారు.
మన నౌకాశ్రయాలు కాలుష్య కారకాలుగా ఉంటే... సింగపూర్ పోర్టులు లాజిస్టిక్ హబ్లుగా మారాయన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో సింగపూర్ ప్రభుత్వం, వ్యాపారవేత్తల సహకారం తీసుకుంటామన్నారు. 2022 నాటికి ఆంధ్రప్రదేశ్ దేశంలోకెల్లా అగ్రస్థానంలో ఉండాలన్నదే తమ లక్ష్యమని చంద్రబాబు వివరించారు. ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం చేపట్టి.. తమ శక్తిని రుజువు నిరూపించుకుంటామన్నారు. రాజధాని అంటే సెక్రటేరియట్, అసెంబ్లీ, కోర్టులు ఇవే కాదు... సామాజిక జీవన నగరంగా ఉండాలని ఆకాంక్షించారు. రాజధాని నిర్మాణంలో భాగస్వామినయ్యాననే భావన ప్రతి తెలుగువాడిలో రావాలన్నారు. సింగపూర్ తరహా రాజధాని అభివృద్ధి చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు చంద్రబాబు గుర్తు చేశారు.
:
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more