విద్యుత్పై తెలుగు రాష్ట్రాలు రెండూ రాజకీయాలు ఆపాలని కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్ సూచించారు. ముఖ్యమంత్రులిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పారు. తెలుగు ప్రజల కోసం చంద్రబాబు, కె.చంద్రశేఖర్రావు ఇద్దరూ కలిసి పనిచేయూలని హితవు చెప్పారు. తెలంగాణ విద్యుత్ సమస్యపై తెలంగాణ రాష్ట్ర మంత్రి టి.హరీష్రావు నేతృత్వంలో టీఆర్ఎస్ ఎంపీలతో కూడిన బృందం గోయల్ను కలిసింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. పీయూష్ మాట్లాడుతూ తెలంగాణకు ఎంత అదనపు విద్యుత్ కావాలి, ఇప్పుడేమీ అక్కర్లేదు కదా..? అనగానే టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత జితేందర్రెడ్డి మాట్లాడుతూ ‘500 మెగావాట్లు కావాలని అడిగాము కదా అన్నారు. మీరండిగింది మార్చిలో.. ఇప్పుడు నవంబర్..ఇప్పుడు పవర్ ఎక్కడిది.. ట్రాన్స్మిషన్కు కూడా అవకాశం లేదని మంత్రి పేర్కొన్నారు. హరీష్రావు కల్పించుకుని అంధ్రప్రదేశ్ లో తెలంగాణకు రావాల్సిన విద్యుత్ వాటా ఇవ్వడం లేదని పిర్యాదు చేశారు. గత వారం మిమల్ని కలసిన టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ అసలు తెలంగాణ ప్రభుత్వం మిమ్మల్ని అడగనే లేదని, పెండింగ్లో మా విన్నపాలు ఏమీ లేవని మీరు చెప్పినట్టు చెబుతున్నారు..’ అని చెప్పారు.
ఈ క్రమంలోనే కేంద్రమంత్రి పీయూష్.. ‘ఈ రాజకీయాలు మానుకోవలని వ్యాఖ్యానించారు. ‘రాజకీయూలు వద్దని ఇద్దరికీ చెబుతున్నా.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెబుతున్నా.. వాళ్లకీ చెప్పాను. మీకూ చెబుతున్నా.. ఇద్దరు సీఎంలు కూర్చుని చర్చించుకుంటే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని చెప్పాను. అక్కడ కాకపోతే.. ఇక్కడ ఢిల్లీకైనా వారిని పిలపించి తాను కూర్చోని సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. ఇలా చేస్తే తెలంగాణకు విద్యుత్ సమస్యతో పాటు.. ఆంధ్రప్రదేశ్ కు సాగునీటి సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more