తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ పచ్చి అబద్ధాల కోరని, ఆయన చేతగానితనం వల్లే తెలంగాణకు విద్యుత్ సంక్షోభం నెలకొందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ముందుచూపుతో విద్యుత్ను కొనుగోలు చేశారన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం చంద్రబాబు ప్రకాశం బ్యారేజ్పై చేసిన మహాధర్నాను కేసీఆర్ వక్రీకరించారన్నారు. అది వాస్తవం అని నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని దేవినేని సవాల్ విసిరారు. కేసీఆర్ ఆరోపణలు నిజమైతే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు.
కేసీఆర్ అసత్య ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వాడుతున్న పదజాలం తెలుగుప్రజలు సిగ్గుతో తలదించుకొనేలా చేస్తోందన్నారు. తెలుగు రాష్ట్రాల రైతుల సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు వ్యవహరిస్తుంటే...కేసీఆర్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మూడు ప్రాంతాల రైతుల సంక్షేమం కోసమే గతంలో చంద్రబాబు ప్రకాశం బ్యారేజీపై బ్రిజేష్కుమార్ ట్రైబ్యునల్కు వ్యతిరేకంగా మహాధర్నా చేశారన్నారు..శ్రీశైలం ప్రాజెక్ట్లో నీటిమట్టం తగ్గితే రాయలసీమ వాసులకు తాగునీటి కష్టాలు తప్పవన్నారు.
పై రాష్ట్రాల నుంచి ఒక్క టీఎంసీ నీటిని కూడా తెచ్చుకునే పరిస్థితి లేదన్నారు. ఎగువ నుంచి ఒక్క టీఎంసీ నీరు వచ్చే పరిస్థితి లేదని, శ్రీశైలంలో నీటిమట్టం తగ్గితే తాగడానికి కూడా నీళ్లుండవన్నారు. చంద్రబాబు ముందుచూపుతో విద్యుత్ కొన్నారని వివరించారు. కేసీఆర్ మొద్ద నిద్రపోయి చంద్రబాబును నిందించడం తగదని మండిపడ్డారు. కేసీఆర్ మాట్లాడే ప్రతి మాట అబద్దమే అని విమర్శించారు. తాము కరెంట్ ఇస్తామన్నా పట్టించుకోని కేసీఆర్ దుర్మార్గంగా వ్యవహరిస్తూ ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని ఉమా అన్నారు. కేసీఆర్ తిట్లు తమకే చెందుతాయని వ్యాఖ్యానించారు. సెంటిమెంట్తో ప్రజలను మభ్యపెట్టడం సరికాదని, వారి సంక్షేమం కోసం కృషి చేయాలని హితవు పలికారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more