ఉగ్రవాదుల దాడులు జరుగొచ్చనే నిఘావర్గాల హెచ్చరికలతో దేశంలోని అన్ని విమానాశ్రయాల్లోనూ హై అలర్ట్ ప్రకటించారు. శంషాబాద్ విమానాశ్రయం, ఆంధ్రప్రదేశ్లోని విశాఖ, గన్నవరం, రాజమండ్రి విమానాశ్రయాల్లోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఈ నెల 25న ముంబై నుంచి వచ్చే ఒక విమానాన్ని పేల్చేయడం లేదా వీలైతే ఆత్మాహుతి దాడి చేస్తారని కోచి విమానాశ్రయ అధికారులకు సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్టు విమానాశ్రయం డైరెక్టర్ ఏకేసీ నాయర్ చెప్పారు. విమానాన్ని బాంబులతో పేల్చి వేస్తామని, లేదా ఆత్మహుతి దాడులకు పాల్పడతామని బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిందన్ని ఆయన మీడియాకు వివరించారు.
శనివారం ముంబై నుంచి కోచి వచ్చే విమానం లేదా శుక్రవారం రాత్రి అహ్మదాబాద్-ముంబై వెళ్లే విమానంపై దాడి చేయనున్నట్టు హెచ్చరికలు వచ్చాయి. ఈ మేరకు ఓ ఆగంతకుడు కోల్కతా విమానాశ్రయ అధికారికి ఫోన్ చేసి బెదిరించాడు. ఆయన వెంటనే కోచి విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. సీఐఎస్ఎఫ్ డీఐజీ ఆనంద్ మోహన్ చెన్నై నుంచి కోచి చేరుకుని అత్యున్నత స్థాయి భద్రత సమావేశం నిర్వహించారు. విషయాన్ని పోలీసులతో పాటు పౌరవిమానయాన రక్షణ దళానికి తెలిపామని, వారి ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని సంబంధిత వర్గాలు తెలిపాయి. కోచి విమానాశ్రయంలో భద్రత బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. బంబును శోధించి, నిర్వీర్యం చేసే దళంతో పాటు క్విక్ రెస్పాన్స్ టీమ్, సీఐఎస్ఎఫ్ విమానాశ్రయాలపై నిరంతర నిఘాను ఏర్పాటు చేస్తున్నాయన్నారు. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో భద్రతను పెంచారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more