జేమ్స్ బాండ్ సినిమాలంటే డెబ్భయ్యవ దశకంలో మంచి క్రేజ్. అప్పటి తరాన్ని ఉర్రూతళూగించి.. బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల పండించిన సినిమాలవి. అయితే 1970లో ఘన విజయం సాధించిన ‘ద స్పై హూ లవ్డ్ మి’ జేమ్స్బాండ్ సినిమాలో కనిపించే సూపర్ కార్ అంటే ఎవరికి ఇష్టం వుండదు. ఎలా కావాలంటే అలా ముడుచుకునే చక్రాలు, నీటి అడుగున జలాంతర్గామిలాగా దూసుకెళ్లే కారు అప్పట్లో ఒక సంచలనం. జేమ్స్ బాండ్ చిత్రాలకు అభిమానులు ఎక్కువ కావడంతో ఇప్పడు ఆయన అభిమానుల మధ్య పోటీ పెట్టాలనుకుంటున్నారు. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కారును ఇప్పుడు అమ్మాకానికి పెడుతోంది.
ఆ సూపర్ కార్ను చిత్ర నిర్మాణ సంస్థ నుంచి సొంతం చేసుకున్న ప్రఖ్యాత ఈబే సంస్థ ఇప్పుడు దీనిని వేలానికి పెట్టింది. దీని ధర సుమారు రూ. 60 లక్షల ధర పలకొచ్చని భావిస్తున్నారు. అప్పట్లో మొత్తం ఆరు కార్లు తయారుచేయగా...ప్రస్తుతం మూడు మాత్రమే మిగిలిఉన్నాయి. జేమ్స్ బాండ్ కారు నా దగ్గర ఉందని చెప్పుకోవటానికి తప్ప ఈ కారు సినిమాలో చూపించినట్లు నీళ్లలో కాదు గదా...కనీసం రోడ్డుమీద కూడా నడిచే పరిస్థితిలో లేదట. అయితే 60 లక్షల రూపాయలు పెట్టి మీరు కదలలేని కారును కోంటున్నారన్నమాట..
గతంలో ఇలాంటి కారునే కొనుగోలు చేసిన టెస్లా వ్యవస్థాపకుల్లో ఒకరు, మరియు సీఈఓగా వ్యవహరిస్తున్న ఎలాన్ మస్క్, దానిని నడిపిస్తానని చెప్పారు. మిలియన్ అమెరికన్ డాలర్లకు కారును సోంతం చేసుకున్న ఆయన సినిమాలో ఈ కారు ఎలా నడిచిందో.. అలానే నడిపిచూపుతానన్నారు. తొలి ప్రయత్నంగా కారును రోడ్డుపై నడిచేలా చేసినా.. కారు ముందుకు కదలేదట. ఇక దానిని సినిమా తరహాలో నీళ్లలో, రోడ్డుపై నడపాలంటే చాలా వ్యయంతో కూడుకున్న పనిగా తెలుసుకున్న ఆయన.. తాను జోక్ చేశానని అన్నారట. ఈ ఎలక్ట్రిక్ కారును నిజంగా నడిచేలా చేసేవారు వున్నారా..? అంటూ ఈబే సంస్థ జేమ్స్ బాండ్ అభిమానులకు సవాల్ విసురుతోంది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more