ప్రజల వద్దకే పాలన.., ప్రజల చేతికే పగ్గాలు ఇవన్నీ మనం సినిమాల్లో చూస్తుంటాం నిజజీవితంలో అక్కడక్కడా వింటుంటాము. కాని టెక్నాలజీ అభివృద్ధి వల్ల ఇది సుసాధ్యం అవుతోంది. అక్రమాలకు చెక్ పెట్టడంలో ఇప్పుడు ప్రజలే కీలకంగా మారారు. జనం ఏం చెప్తే ప్రభుత్వాలు అవి చేసే స్థాయిలో మార్పు వచ్చింది. ఇక టెక్నాలజిని అందిపుచ్చుకోవటంలో వినియోగించుకోవటంలో భారతీయుల తర్వాతే ఎవరైనా. మొబైల్ ఒకప్పుడు వ్యక్తి హోదాను తెలిపే వస్తువు అయితే ఇప్పుడది అందరికి కనీస అవసరం అయింది. సెల్ ఫోన్ లేని యువతను చాలా తక్కువ సంఖ్యలో మనం చూస్తున్నాము.
సెల్ ఫోన్ తో మాట్లుడుకోవటం.. చాటింగ్, బ్రౌజింగ్, చివరకు బిల్ పేమెంట్ల వరకు అభివృద్ధి చెందాము. కాని ఇప్పుడిదే మొబైల్ ద్వారా ట్రాఫిక్ కూడా క్లియర్ చేయవచ్చట. ప్రస్తుతం ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి వాట్సాప్ అప్లికేషన్ ఉంది. ఇది తప్పనిసరి అయింది కూడా. దీన్ని ఉపయోగించే ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ఢిల్లీ పోలిసులు శ్రీకారం చుట్టారు. చిన్న గల్లీలు, రోడ్లు ఇలా ఎక్కడ ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగినా ఫోటో పెట్డండి.. వెంటనే అక్కడకు వచ్చి రూట్ క్లియర్ చేస్తాం అంటున్నారు.
మామూలుగా రోడ్లపై ఓ పక్కకు, గల్లీల్లో ఇష్టంవచ్చినట్లుగా వాహనాలు పార్కింగ్ చేసి వివిధ పనుల నిమిత్తం వెళ్తుంటారు. ఇలా చేయటం వల్ల ఆ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు వస్తుంటాయి. ఇలా ఇష్టంవచ్చినట్లు పార్కింగ్ చేసిన వాహనాల ఫొటోలను తీసి.. ఎక్కడ పార్కింగ్ చేశారో స్థలం వాట్సాప్ లో ఢిల్లీ పోలిసులకు పంపిస్తే వారు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేస్తారట. ఇది చాలా సులభంగా ఉంది కదా. ఇక్కడ కంప్లయింట్ చేసిన వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచుతామని అధికారులు చెప్తున్నారు. ఇక వాట్సాప్ అప్లికేషన్ లేదా.., మొబైల్ ఫోన్ ఉండి అందులో డబ్బులు ఉంటే 08750871493 నంబర్ కు ఫోన్ చేసినా సరిపోతుంది అని అధికారులు చెప్తున్నారు. వాట్సాప్ కామెంట్లకే కాదు కంప్లయింట్లకు కూడా ఉపయోగపడుతుంది అని ఇప్పుడిప్పుడే అర్ధం అవుతుంది. మీరు కూడా మీ వాహనాన్ని పార్కింగ్ చేసేటపుడు ముందు వెనక ఆలోచించండి.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more