సౌది రాజులు, షేక్ ల గురించి మనకు చాలానే తెలుసు. లెక్కకు మించిన డబ్బు, వారు అనుభవించే రాజభోగాల గురించి చాలాసార్లు విన్నాము. ఇక సౌది రాజు అబ్దుల్లా రాజభోగం గురించి ఎంత చెప్పినా తక్కవే. ఆయన కార్లు.., కుటంబం, భార్యలు వారి ఖర్చుల గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటుంది. తాజాగా ఈ రాజు తన కూతురు వివాహంను అంగరంగ వైభవంగా నిర్వహించారు. డబ్బును నీళ్ళకంటే మరీ ఎక్కువగా ఖర్చుపెట్టి పెళ్లి చేశాడు. తాను అల్లారుముద్దుగా పెంచిన కూతురును అత్తవారింట బంగారంలా చూసుకోవాలనే ఉద్దేశ్యంతో పెళ్ళిని బంగారుమయం చేశాడు.
ఎంతలా అంటే.., టాయ్ లెట్ ను కూడా బంగారంతో చేయించాడు. పాశ్చాత్య మోడల్ లోని టాయ్ లెట్ ను పూర్తిగా స్వచ్చమైన స్వర్ణంతో తయారు చేయించారు. అందులోని పరికరాలు కూడా మేలిరకం పుత్తడివేనట. అయితే దీని విలువను మాత్రం బయటకు చెప్పలేదు. కుమార్తె పెళ్ళి గౌను కోసం ఏకంగా మూడు కోట్ల డాలర్లు ఖర్చుపెట్టాడు. ఇదంతా బంగారంతో తయారు చేయించారట. ఇలా అంగరంగ వైభవంగా.. అంతా చెప్పుకునేలా కూతురు వివాహం జరిగింది. ఈ పెళ్లి, బహుమతుల విషయం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.
పెళ్ళి సందర్బంగా కూతురు కొత్త కాపురంకు కావాల్సిన అన్ని సామాన్లు ఇవ్వటం ముస్లింలతో పాటు ఇతర మతాల్లో కూడా సాంప్రదాయంగా వస్తుంది. కనీస అవసరాల నుంచి స్థాయిని బట్టి విలాసాల వరకు సమకూరుస్తారు. కాని ఇలా పుత్తడి టాయ్ లెట్ బహుమతి ఇవ్వటం అంటేనే ఈ రాజు విలాసం ఎలాంటిదో చెప్పవచ్చు. ఇక కుటుంబం విషయానికి వస్తే అబ్దులా గారికి 11మంది భార్యలు, 16మంది సంతానం ఉన్నారు. ప్రతి సారి ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులు, ధనవంతులైన ముస్లిం కుబేరుల జాబితాలో అబ్దుల్లా పేరు ఉంటుంది. ఇంతకీ ఆయన ఆస్తి విలువ ఎంత అంటే 21బిలయన్ డాలర్ల పైమాటే అని తెలుస్తోంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more