వారు డ్రైవర్లు. వారి నిర్లక్ష్యం ఖరీదు 14 మంది ప్రాణాలు. ఎంతో మంది ప్రయాణికుల ప్రాణాలను తమ గుప్పిట్లో పెట్టుకుని.. నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఆ డ్రైవర్లు. వారు రైలు లోకో పైలట్. అంటే రైలు డ్రైవర్లు. సిగ్నలింగ్ వ్యవస్థపై ఆధారపడి నడుస్తున్న రైళ్లను.. రైలు డ్రైవర్లే అధిగమించడం క్షమించరాని నేరం. వారి విధులనే వారు పట్టించుకోలేదనే అర్థం. ఎంతో మంది రైలు ప్రయాణికుల ప్రాణాలు తమ చేతిలో వున్నాయని తెలిసి కూడా ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించారన్నది అర్థం కాని ప్రశ్న. ఇందుకు ఫలితంగా ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్లో గత అర్థరాత్రి రెండు ఎక్స్ప్రెస్ రైళ్లు ఢీ కొన్నాయి.
ఈ ప్రమాదంలో సంఘటనాస్థలంలోనే పన్నెండు మంది మరణించారు. మరో 45 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు రైల్వే శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. బోగిల మధ్య చిక్కుకుని మరో ఇద్దరు ప్రయాణికులు మరణించారు. క్రిషాక్ ఎక్స్ప్రెస్ రైలు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి, సిగ్నల్ దాటి వెళ్లి అదే ట్రాక్పై వస్తున్న బరౌనీ ఎక్స్ప్రెస్ను ఢీ కొట్టాడు. దీంతో బరౌనీ ఎక్స్ప్రెస్కు చెందిన అయిదు జనరల్ బోగీలు పట్టాలు తప్పగా... క్రిషాక్ ఎక్స్ప్రెస్ రైలులోని పలు కోచ్లు దెబ్బతిన్నాయి. కాగా క్రిషాక్ ఎక్స్ప్రెస్ రైల్ డ్రైవర్లు ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు. ఈ ప్రమాద ఘటనపై రైల్వే బోర్డు విచారణకు ఆదేశించింది.
ఈ ఘటనపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల పరిహారాన్ని ప్రకటించిన ఆయన, తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయలను, క్షతగాత్రులకు 20 వేల రూపాయలను నష్టపరిహారంగా అందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు రైలు డ్రైవర్లదే పూర్తి బాధ్యతని, వారు సిగ్నల్ వ్యవస్థను పట్టించుకోకుండా వెళ్లడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. రైలు డ్రైవర్లపై సస్పెన్షన్ వేటు వేశామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సదానంద గౌడ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more