కన్న కొడుకు ఉండగానే కోడలిపై దాడులు, అఘాయిత్యాలకు పాల్పడే మామల గురించి మనకు బాగా తెలుసు. ఇక భర్త చనిపోతే.., అత్తవారింట్లో ఆమె పడే కష్టాలు, అవమానాల గురించి తెలియని వారు ఉండరు. భర్తను కోల్పోయి బాధపడటంతో పాటు., అత్తవారు పెట్టే కష్టాలను తలచుకుని వితంతు భార్యలు తమలో తాము కుమిలిపోతుంటారు. కాని గుజరాత్ లో ఓ కోడలికి మామ కొత్త జీవితం ప్రసాదించాడు. భర్త చనిపోయిన కోడలికి మరొక పెళ్లి చేసి కొత్త జీవితం అందించాడు. ఘనంగా పెళ్లి జరిపించి అందరికి ఆదర్శంగా నిలిచాడు.
గుజరాత్ లోని పోర్ బందర్ ఎంపీ విఠల్ రాడాడియా మంచి మనసున్న వ్యక్తి. స్థానికంగా రైతు నాయకుడుగా అందరికి సుపరిచితుడు. అతనికి ఇద్దరు కుమారులు కాగా., పెద్దబ్బాయి కల్పేష్ రాడాడియా ఈ ఏడాది ప్రారంభంలో గుండెపోటుతో మృతి చెందాడు. కల్పేష్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త చనిపోయిన తర్వాత కోడలు మనీషా కల్పేష్ ను తలుచుకుని బాధపడుతుండేది. ఇది చూసి తట్టుకోలేకపోయిన రాడాడియా కోడలికి కొత్త జీవితం అందిస్తే.. బాధ నుంచి బయటపడుతుందని భావించాడు.
సరైన సంబంధం కోసం వెతికాడు. చివరకు చిన్నబ్బాయి లలిత్ స్నేహితుడు అయిన హర్ధిక్ చోవాటియాతో సంబంధం కుదిరింది. భర్త చనిపోయాడు అని తెలుసుకుని పెళ్లి చేసుకునేందుకు హర్ధిక్ ముందుకు వచ్చాడు. ఇంతటితో తన పని అయిపోయింది అని రాడాడియా వదలి పెట్టలేదు. సొంత కూతురులా పెళ్లి చేసి పంపించారు. అది కూడా ఆషామాషిగా కాదు. రాజ్ కోట్ లోని జామ్ కండోర్నా పట్టణంలో ఘనంగా పెళ్లి జరిపించి.., రూ.100కోట్ల విలువైన ఆస్తిని బహుమతిగా ఇచ్చాడు. సొంత కూతురుకు కూడా అంత ఆస్తి ఇచ్చేందుకు తల్లితండ్రులు ఈ రోజుల్లో వెనకాడుతుండగా.., భర్త చనిపోయి బాధలో ఉన్న కోడలి సంతోషం కోసం ఇంత చేసిన విఠల్ నిజమైన నాయకుడు అని.., ఉత్తమ విలువలు గల వ్యక్తి అని అంతా ప్రశంసిస్తున్తున్నారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more