దసరా, దీపావళి సీజన్ వచ్చేసింది. అదేంటి సీజన్ అంటారు అనుకుంటున్నారా..? ఇది బడా షాపింగ్ మాల్స్ కు, కస్టమర్లకు సీజనే కాబట్టి. ఈ పండుగ నుంచి ప్రారంభమయ్యే సీజన్ సంక్రాంతి, ఉగాది వరకు కొనసాగుతుంది. ఈ పండుగ సీజన్ ఎప్పడు వస్తుందా.. ఎప్పడెప్పుడు కోత్త ఆపర్ల వస్తాయా అంటూ కస్టమర్లు ఎదురుచూస్తుంటే.. పండగ సీజన్ లో బోనస్ వ్యాపారాలను కొనసాగించాలని పలు వ్యాపార సంస్థలు ఎదురు చూస్తుంటాయి. దసరా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయో.. లేదో.. అప్పడే బిగ్ సి తో పాటు టీఎంసీ సంస్థ కూడా పండుగ ఆఫర్లను తీసుకోచ్చింది. ఇక వస్త్ర, వ్యాపార సంస్థలు కూడా పండగ సీజన్లో మార్కట్ తో పోటీ పడుతూ ఆపర్లను తీసుకువస్తున్నాయి.
మొబైల్ విక్రయాల్లో అతిపెద్ద సంస్థ బిగ్ సి దసరా, దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని దసరావళి పేరుతో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ పండుగ సీజన్లో ఒకటి కొంటే ఒకటి, ఒకటి కొంటే రెండు, ఒకటి కొంటే మూడు, ఒకటి కొంటే నాలుగు మొబైళ్లతో పాటు ఎంపిక చేసిన పలు మోడళ్లపై ప్రత్యేక రాయితీ ఇస్తున్నట్లు బిగ్ సి చైర్మన్ బాలు చౌదరి తెలిపారు. మైక్రోమాక్స్ ఏ37బీ కొనుగోలుపై 50 శాతం , ఐఫోన్ 5ఎస్పై 25శాతం డిస్కౌంట్ ఇవ్వనుండగా, రూ.8,999 విలువైన మైక్రోమాక్స్ ఏ177 కొనుగోలుపై రూ.4 వేల విలువైన నాలుగు ఫీచర్ ఫోన్లు ఉచితంగా అందచేయన్నారు.
రూ.4,999 ధర కలిగిన కార్బన్ కే85పై రూ.3 వేల విలువైన మూడు మొబైళ్లను ఫ్రీగా ఇవ్వనున్నది. దీంతోపాటు నోకియా లూమియా 630పై రూ.5 వేల విలువగల హెచ్సీఎల్ ట్యాబ్ను ఉచితంగా అందిస్తున్నది. రూ.1,999 విలువైన సెల్కాన్ సీ4040 టచ్ఫోన్ కొనుగోలు చేసిన వారికి రూ.వెయ్యి ఫోన్ను ఉచితంగా ఇవ్వనుండగా, రూ.7,999 ధర కలిగిన సామ్సంగ్ గెలాక్సీ ట్రెండ్పై రూ.2 వేల విలువైన రెండు ఫోన్లను అందిస్తున్నది. సోనీ ఈ3ని కొనుగోలు చేసిన వారికి వెయ్యి రూపాయల విలువగల పవర్ బ్యాంక్ను, నోకియా ఎక్స్ఎల్పై రూ.499 విలువైన ఫిలిప్స్ హెడ్సెట్ను ఉచితంగా అందచేస్తున్నట్లు తెలిపింది.
అటు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల రిటైల్ విక్రయ సంస్థ టీఎంసీ.. వెల్ సెటిల్డ్ ఫర్ లైఫ్ విత్ టీఎంసీ పేరుతో దసరా, దీపావళి ఆఫర్లను ప్రకటించింది. దసరా లక్కీ డ్రాలో రూ.5,12,500 విలువైన హోండా అమేజ్ కారు, దీపావళి డ్రాలో రూ.25 లక్షల నగదు, బంపర్ డ్రాలో రూ.45 లక్షల విలువైన డూప్లెక్స్ విల్లాను బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపింది. రూ.1000 కొనుగోలు చేసిన వారు ఈ మూడు ఆఫర్లను పొందేందుకు అర్హులని వెల్లడించింది. వచ్చేనెల 9లోగా బజాజ్ ఫైనాన్స్ సదుపాయంపై కొనుగోలు చేసిన వారికి డ్రాలో ఒక్కొక్కటి రూ.3 లక్షల విలువ చేసే రెండు వడ్డాణాలను గెల్చుకునే అవకాశం ఉంటుందని సంస్థ తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ఇటు వస్త్ర వ్యాపార రంగంలో పెరొందిన సంస్థలు కూడా తమ పండుగ ఆపర్లను ప్రకటించాయ్.. భారీ డిస్కంట్ లను అందిస్తున్నాయి. పలు సంస్థలు బంపర్ డ్రాలతో కస్లమర్లను ఆకర్షిస్తుండగా, పలు సంస్థలు రోజుకో బహుమతి పేరుతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి ఆఫర్ల సీజన్ కస్టమర్లకు భలే కలిసోస్తుంది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more