మాజి కేంద్రమంత్రి చిదంబరంకు కొడుకు కష్టాలు ఇంకా తీరటంలేదు. ఆయన కొడుకు నడుపుతున్న ఎయిర్ సెల్ కంపనీ కేటాయింపులు, అనుమతులపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా సీబీఐ చిదంబరం తప్పు చేశారని కోర్టుకు తెలిపింది. ఈ వ్యవహారంలో పరిమితిని దాటి వ్యవహరించారని సీబీఐ ప్రత్యేక కోర్టుకు తెలిపింది. సోమవారం జరిగిన విచారణలో ఇప్పటివరకు జరిపిన దర్యాప్తు వివరాలను కోర్టుకు తెలిపింది. యూపీఏ హయంలో ఆర్ధికమంత్రి హోదాలో చిదంబరం రూ.3,500 కోట్ల ఒప్పందానికి అనువుతిచ్చే అధికారం ఆయనకు లేదని తెలిపింది.
విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహకబోర్డు (ఎఫ్ఐపీబీ) తో మ్యాక్సిస్ ఒప్పందాన్ని ఆమోదించే అధికారం చిదంబరానికి లేదని స్పష్టం చేసింది. ఆర్థిక వుంత్రిగా కేవలం రూ. 600 కోట్ల విలువైన ఒప్పందాలను మాత్రమే అనువుతించే అధికారం ఉంటుందని అంతకంటే ఎక్కువ విలువైన ఒప్పందాలు ఆర్థికవ్యవహారాలను పర్యవేక్షించే కేబినెట్ కమిటీ (సీసీఈఏ)కు ఉంటుందని కోర్టుకు తెలిపింది. చిదంబరం పరిమితిని దాటి అక్రమంగా కార్తి కోసం ఏకంగా రూ.3,500 కోట్ల ఒప్పందాన్ని అనుమతించారని వెల్లడించింది. సీబీఐ ఆరోపణలు విన్న కోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 13వ తేదీకి వాయిదా వేసింది.
యూపీఏ వరుస కుంభకోణాల్లో ఇది ఒకటిగా చెప్పవచ్చు. విదేశాల నుంచి అక్రమంగా నిధులు తీసుకువచ్చారంటూ ఈ కంపనీ ఒప్పందాలపై ఆరోపణలు వచ్చాయి. ఎయిర్ సెల్ వ్యవహారాలను చిదంబరం కుమారుడు కార్తి చూస్తుండటంతో ప్రభుత్వంపై ఆరోపణలు ఎక్కువయ్యాయి. ప్రతిపక్షాల దాడి నేపథ్యంలో సీబీఐ విచారణ జరుగుతోంది. ఇదే కేసులో మాజి టెలికం మంత్రి దయూనిధి వూరన్, సోదరుడు కళానిధి వూరన్, సన్ డెరైక్ట్ టీవీ, సౌత్ ఆసియూ ఎంటర్టైన్మెంట్ హోల్డింగ్, మ్యాక్సిస్ కమ్యూనికేషన్, ఆస్ట్రాల్ ఆసియూ నెట్వర్క్ సంస్థలతోపాటు పలువురు ప్రముఖులను నిందితులుగా సీబీఐ చేర్చింది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more