తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ మీద గత కొన్ని రోజులుగా రాజకీయ పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే! ముఖ్యంగా ఆయన త్వరలోనే బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని.. ఆయన్ను తమ పార్టీలోకి చేర్చుకోవడానికి అగ్రనేతలు సైతం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని మీడియాలో ఎన్నో వార్తాకథనాలు వచ్చాయి. ఆయన్ను తమ పార్టీలోకి చేర్చుకోవడానికి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో స్వయంగా ప్రధాని నరేంద్రమోడీయే రజనీకాంత్ ను కలవడానికి వచ్చారని... అలాగే మొన్న బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ - మోడీ సన్నిహితుడు అమిత్ షా కూడా ఆయనతో మంతనాలు జరిపారని వార్తలొస్తున్నాయి. ఒకవేళ ఈయన పార్టీలోకి జాయిన్ అవడానికి సుముఖత వ్యక్తం చేస్తే... తమిళనాడు రాష్ట్ర బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి కూడా ఆ పార్టీ సిద్ధంగా వుందనే కథనాలు కూడా వచ్చాయి.
అయితే తమపై వస్తున్న ఈ ఆరోపణల నేపథ్యంలో బీజేపీ తమిళనాడు పూర్తిగా ఖండిస్తూ.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం తాము వెంపర్లాడుతున్నట్టు వస్తున్న వార్తలు కేవలం పుకార్లేనని చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ వారు తమ మాటను మారుస్తూ కొంచెం ప్రత్యేక రీతిలో విశ్లేషణ ఇచ్చుకున్నారు. అదేమిటంటే.. రజనీకోసం తాము వెంటపడటం లేదుకానీ.. ఆయన మాత్రం తమవాడేనంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆమె మాట్లాడుతూ.. రజనీకాంత్ కు బీజేపీ పార్టీ అంటే చాలా గౌరవమని.. అలాగే ఆయనంటే బీజేపీ పార్టీ చాలా సానుకూలంగా వుందని అని చెప్పిన ఆమె... ఆ మర్యాదతోనే ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ, రజీనీకాంత్ తో కలుసుకున్నారని అన్నారు. అంటే.. బీజేపీ పార్టీలోకి సూపర్ స్టార్ ఎప్పుడో చేరిపోయాడనే ధీమాను ఆమె వ్యక్తం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇదిలావుండగా.. రాబోయే ఎన్నికల్లో రజనీని బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించనున్నట్లుగా వస్తున్న వార్తలు కేవలం కథనాలు మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. ఆ కథనాలను తమ పార్టీ ఎప్పుడూ ధ్రువీకరించలేదని అన్నారు. గతంలో కూడా ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నదులను అనుసంధానం చేయాలనుకున్నప్పుడు ఆ ప్రాజెక్టుకు రజనీకాంత్ కోటి రూపాయల విరాళం ఇచ్చిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. జాతీయ దృక్పథం ఉన్న రజనీని తాము సాదరంగా స్వాగతిస్తామని... ఆయన స్వతహాగా పార్టీలోకి వస్తానంటే మేము సాదరంగా ఆహ్వానిస్తామని తెలిపారు. అయితే ఈమె మాట్లాడిన మాటలు విన్న కొంతమంది రాజకీయ విశ్లేషకులు... బీజేపీ పార్టీలోకి రజనీకాంత్ చేరిపోయారన్న ధీమాతో ఆ పార్టీ వున్నట్లు తెలుపుతున్నారు. అయితే.. రజనీకాంత్ మాత్రం ఇంకా ఈ రాజకీయ దుమారంపై పెదవి మాత్రం విప్పలేదు. మరీ ఆయన పార్టీలోకి చేరుతారా..? లేదా..? అసలు రాజకీయ రంగంలోకి అడుగులు పెడతారా..? లేదా..? అన్నది తెలుసుకోవాలంటే.. రజనీకాంత్ నేరుగా మీడియా సమావేశంలో మాట్లాడితే గానీ తెలియదు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more