పోలవరం ప్రాజెక్టు వివాదం ఇంకా ముగిసిపోలేదు. ప్రాజెక్టు ప్రారంభం నుంచి బాలారిష్టాలను ఎదుర్కుంటున్న ఈ ప్రాజెక్టుకు ఇంకా పలు అనుమతులు రావాల్సి ఉంది. కీలకమైన తెలంగాణలో ముంపు గ్రామాల అంశం హై డ్రామాల మద్య ఓ కొలిక్కి వచ్చింది. ఇష్టం ఉన్నా లేకపోయినా ఏడు మండలాలను ఏపీలోకి కలిపింది కేంద్రం. దీంతో తెలంగాణ నుంచి ప్రాజెక్టుకు అడ్డంకి రాకుండా చెక్ పెట్టింది. ఇక ముంపు మండలాల సమస్య, పరిష్కార బాద్యత ఏపిదన్నమాట. వారి పునరావాసం, పరిహారం అన్ని బాబు సర్కారు చూసుకోవాల్సింది. అయితే ఈ గ్రామాల విలీనం బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందినా ఇంకా పోరాటం చేస్తామని అప్పుడప్పుడూ టీఆర్ఎస్ అంటోంది. ఇక ఎంత చేసినా లాభం ఉండదని వాళ్ళకూ తెలుసు అయినా సరే సమస్యను అలా కొనసాగించాలి కాబట్టి అనక తప్పదు.
మూడు రాష్ర్టాల్లో ముంపు గ్రామాలు
పోలవరం ప్రాజెక్టు వల్ల మూడు రాష్ర్టాల్లో గ్రామాలు ముంపునకు గురవుతాయని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. పార్లమెంటులో ఈ అంశంపై బుధవారం ప్రకటన చేశారు. ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్ లోని 276 గ్రామాలు ముంపునకు గురవుతాయన్నారు. ఏపీతో పాటు ఒడిశాలోని 8 గ్రామాలు, ఛత్తీస్ గడ్ లో 4 గ్రామాలు ముంపుకు గురవుతాయన్నారు. భూమి పరంగా చూస్తే మొత్తం 3,427 హెక్టార్ల భూమి మునిగిపోతుందని పార్లమెంటుకు వివరణ ఇచ్చారు. చట్ట ప్రకారం ముంపు బాధితులకు పునరావాసం, పరిహారం కల్పిచబడుతుందన్నారు. నిబంధనలకు లోబడి ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని హామి ఇచ్చారు. అనేక అవాంతరాలను ఎదుర్కుని ఓ వివాదాస్పద ప్రాజెక్టుగా ముద్రపడ్డ పోలవరం పూర్తవుతుందా.., తమకు నీళ్ళు వస్తాయా అని రైతన్నలు ఆశగా ఎదురు చూస్తున్నారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more