నిన్నమొన్నటి వరకు మనకు స్మార్ట్ ఫోన్లలో రకరకాల ఫీచర్స్ తో విడుదలైన సంగతి తెలుసు! ఇప్పటివరకూ వాటర్ ప్రూఫ్, స్ర్కాచ్ ప్రూఫ్, శాటర్ ప్రూఫ్ వంటి రకరకాల స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో హల్ చల్ చేశాయి. ఇప్పటికీ తయారీదారులు రకరకాలుగా పుంతలు తొక్కుతూ సరికొత్త ఒరవడితో కూడిన స్మార్ట్ ఫోన్లను తయారుచేస్తూనే వున్నారు. ఇటువంటి తయారుల్లో ముందుగా పేరొచ్చేది శ్యాంసంగ్ దేనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. ఇంతవరకు ట్రెయిన్ బోగీలతో పోటీపడుతూ ఎస్1, ఎస్2, ఎస్3 అంటూ ఎన్నోరకాల మోడల్స్ తోపాటు అంతరిక్షంలో వున్న గేలక్సీలను సైతం వదలకుండా గేలక్సీ నోట్, గేలక్సీ గ్రాండ్ వంటి రకాలను కూడా విడుదలను చేసింది.
ఇదిలావుండగా.. తాజాగా జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో శ్యాంసంగ్ కంపెనీవారు తమ ఫోన్ ‘‘బుల్లెట్ ప్రూఫ్’’ అంటూ డప్పులు వాయించుకుంటోంది. ‘‘ఇదేంటి..? ఈ కంపెనీవారు మరీ ఇంత విడ్డూరంగా ప్రవర్తిస్తోంది..? మార్కెట్ లో కొత్త రకాలు వస్తున్నాయి కదా అని యూజర్లు కొనుక్కుంటుంటే... వాళ్లను పిచ్చోళ్లనుకుందేమో! మరీ ఇంతగా డప్పు వాయించుకోవాలా..?’’ అని కొంతమంది సెటైర్లు వేస్తే.. దానికి బదులుగా ఆ కంపెనీ వారందరూ నోరు మూసుకునేలా సమాధానం ఇచ్చింది. ఈ విషయాన్ని మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ.. దీనికి సంబంధించి ఒక విశేషమైన సంఘటన కూడా జరిగింది!
అసలు విషయం ఏమిటంటే.. చైనాలో ఇద్దరు స్నేహితులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వారికి ఒక పర్సు దొరికింది. అయితే ఆ పర్సు నాదని నాదంటూ ఒక్కొక్కరు వాదులాడుకోవడం మొదలుపెట్టేశారు. ఆ నవ్వులాట కాస్త సీరియస్ గా మారిపోయింది. అంతే! వారిద్దరిలో ఒకరి దగ్గర వుండే పిస్టల్ ను బయటికి తీసే ఇంకొకడి గుండెల మీద గురిపెట్టి తుపాకీ కాల్చాడు. బుల్లెట్టు సూటిగా గుండెల్లో దిగి.. ప్రాణాలు పోయాయని అనుకున్నాడు కానీ.. అదృష్టం బాగుండి ఆ వ్యక్తి బతికి బయటపడ్డాడు. ఇదెలా సాధ్యమయిందని ఇద్దరు తమ మొహాలు చూసుకున్నారు. అప్పుడు బయటపడింది.. అసలు విషయం!
అతని జేబులో శ్యాంసంగ్ గేలక్సీ ఎస్4 మొబైల్ ఫోన్ వుంది. ఆ వ్యక్తి తన పై జేబులో ఫోన్ పెట్టుకోగా.. ఆ తుపాకీ గుండును సైతం అది ఎదుర్కొని మనిషి ప్రాణాలను కాపాడింది. ఈ ఘటనలో మొబైల్ బ్రేక్ అయ్యింది కానీ.. మనిషి ప్రాణాలు మాత్రం పోలేదు. దీంతో చచ్చాన్రాబాబు అని అనుకున్న ఆ వ్యక్తి.. బతికి బయటపడ్డానురా బాబు అంటూ అక్కడి నుంచి పరుగులు తీశాడు. దీంతో శ్యాంసంగ్ మొబైల్ బుల్లె ప్రూఫ్ అని నిరూపించుకుంది. ఇదే విషయాన్ని తెలుసుకున్న కంపెనీలు పెద్దలు కూడా కొద్దిసేపు వరకు షాక్ కు గురయ్యారట!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more