ఐటి కి కేంద్రంగా విశాఖపట్నం అభివృద్ధి చెందుతుందనటానికి అక్కడ రాబోతున్న ఐటి విలేజ్ కారణం.
కేరళ రాష్ట్రంలో కోచి లో ఉన్న ఐటి విలేజ్ మాదిరి ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పటానికి ముందు అవగాహన కోసం రాష్ట్ర ప్రభుత్వ ఐటి సలహాదారు జె.సత్యనారాయణ నేతృత్వంలో అధికారుల బృందం కోచి వెళ్తున్నారు. అక్కడ ప్రయోగాత్మకంగా ఇకో సిస్టమ్ ని ఏర్పాటు చేసారని, దానితో వందలాది ఐటి కెంపెనీలు వెలిసాయని, అందువలన ఆ సిస్టమ్ ని ఇక్కడ ఏర్పాటు చెయ్యటానికి దాన్ని అధ్యయనం చెయ్యటానికి పోతున్నామని జె సత్యనారాయణ తెలియజేసారు. రాబోయే 10 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ లో వెయ్యి ఐటి కంపెనీలు వచ్చే విధంగా కృషి చెయ్యటానికి కంకణం కట్టుకున్నారు వాళ్ళు.
ఐటి అభివృద్ధి కోసం తయారు చేసిన 18 పాలసీలలో ఒకటి హార్డ్ వేర్ అభివృద్ధి కోసమని, వాటిని క్యాబినెట్ ఆమోదం కోసం ఇచ్చివున్నామని, పాలసీ మీద ఆమోదం రాగానే దేశ విదేశాల్లోని పెట్టుబడిదారుల చేత సంస్థలను స్థాపించటానికి ప్రయత్నాలు చేస్తామని సత్యనారాయణ అన్నారు. సాఫ్ట్ వేర్ అభివృద్ధి కోసం విదేశీ సంస్థలను అమెరికా జపాన్ దేశాల నుంచి, హార్డ్ వేర్ కోసం తైవాన్, దక్షిణ కొరియా దేశాల నుంచి సంస్థలు వచ్చేట్టుగా కృషి చేస్తామన్నారాయన.
ఐటి ఎగుమతులు కొత్త రాష్ట్రంలో .25 శాతమే ఉండొచ్చు కానీ రాబోయే 6 సంవత్సరాలలో దాన్ని 20 రెట్లు పెంచే దిశగా ప్రయత్నాలు చేస్తామంటున్నారు.
విశాఖపట్నం ఐటి కేంద్రంగా, కాకినాడ, అనంతపూర్, చిత్తూరు, విజయవాడ లలో ఐటి పార్క్ లను అభివృద్ధి చెయ్యటం ఐటి ప్రణాళికలో ఉంది.
ఆంధ్రప్రదేశ్ వెబ్ సైట్ ద్వారా ప్రోమోట్ చేస్తూ, 2017 కల్లా 2 బిలియన్ డాలర్లు, 2020 కల్లా 5 బిలియన్ డాలర్ల ఐటి పెట్టుబడులు వచ్చేట్టుగా చేస్తామంటున్నారు సత్యనారాయణ.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more