Andhra employees in hyderabad

ap cm chandrababu naidu, andhra employees in hyderabad, andhra ngo, chandrababu naidu meeting in vijayawada, Chandrababu releases White Paper on Industry, tdp

andhra employees in hyderabad

ఆంధ్రా ఉద్యోగులను శ్లాఘించిన చంద్రబాబు

Posted: 07/12/2014 05:21 PM IST
Andhra employees in hyderabad

ఆంధ్రా ఉద్యోగుల వలనే తాను ముఖ్యమంత్రి నయ్యానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు విజయవాడలో మాట్లాడుతూ అన్నారు.  ఉద్యోగుల సమస్యలను దశలవారీగా పరిష్కరించటం జరుగుతుందని కూడా ఆయన అన్నారు.  ప్రతి మూడు నెలలకోసారి ఉద్యోగులతో సమావేశాలను నిర్వహించి పరిస్థితులను సమీకరించటం జరుగుతుందని కూడా ఆయన హామీ ఇచ్చారు.  రాష్ట్రాభివృద్ధి కోసం తనో కూలీగా పనిచేస్తానని మరోసారి అన్న చంద్రబాబు ఇప్పుడు కష్టపడి పనిచెయ్యవలసిన సమయం ఆసన్నమైందని, ఆ పని చెయ్యకపోతే భావితరాలకు నష్టం చేసినవారిమౌతమని అన్నారు.

ఉద్యోగులకు హెల్త్ కార్డ్ లు, ఒప్పంద కార్మికుల క్రమబద్ధీకరణలాంటి పనులను సత్వరం చేపడతానని చంద్రబాబు నాయుడు సభాముఖంగా హామీ ఇచ్చారు.  

ఆంధ్రా ఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో చంద్రబాబు నాయుడుకి జరిగిన సన్మాన సభలో మాట్లాడుతూ ఆ సంఘ అధ్యక్షుడు అశోక్ బాబు చంద్రబాబు పరిణితి చెందిన రాజకీయవేత్తని అన్నారు.  ఈ పరిస్థితుల్లో తాము హైద్రాబాద్ లో పనిచెయ్యటానికి సిద్ధంగా లేమని, రాజధాని ఎక్కడో తెలిస్తే అక్కడే పనిచేస్తామని అన్న అశోక్ బాబు, సీమాంధ్రాలో చేసినట్లుగానే తెలంగాణాలో కూడా తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావటానికి కృషి చేస్తామని ఉద్యోగుల తరఫున మాటిచ్చారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles