(Image source from: Narendra modi comments on latest railway budget 2014-2015)
ఒకవైపు ప్రతిపక్ష నాయకులు, సామాన్య నగరవాసులు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై నిరసన వ్యక్తం చేస్తుంటే... ప్రధాని నరేంద్రమోడీ మాత్రం దానిని పొగుడుతున్నారు. తమ ప్రభుత్వం నుంచి విడుదలయిన మొదటి రైల్వే బడ్జెట్ సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే ఆయన ఈ బడ్జెజ్ ను విడుదల చేసిన కేంద్రమంత్రి గౌడను పొగిడారు.
ఈ బడ్జెట్ పై మోడీ మాట్లాడుతూ... ‘‘ఈ సారి విడుదలైన బడ్జెట్ ను చూస్తుంటే దేశం అభివృద్ధి బాటలో నడుస్తున్నట్టు కనిపిస్తోంది. ఇది ఒక ఇండియాకు ఒక ‘‘గ్రోత్ ఇంజన్’’ పనిచేస్తుంది. మన భారతదేశంలో వున్న పారదర్శకతను తొలగించి, దేశ సమగ్రతను చాటేందుకు ఇది ఎంతో దోహదపడుతుంది. దీనిని గుర్తు చేసుకున్న ప్రతిసారి భవిష్యత్తులో అభివృద్ధి చెందుతున్న మన భారతదేశం కనిపిస్తోంది. ఈ బడ్జెట్ ద్వారా మన టెక్నాలజీని సదావకాశంగా వినియోగించుకోవచ్చు. ఈ బడ్జెట్ మన ఆధునిక భారతదేశాన్ని ప్రతిబింబిస్తున్నట్టు అనిపిస్తోంది’’ అని ఆయన తన మనసులోని భావనలను వ్యక్తం చేశారు.
అలాగే.. ‘‘ఈసారి విడుదలైన రైల్వే బడ్జెట్ ఆధారంగా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా అభివృద్ధి దిశలో నడుస్తున్నట్టు కనిపిస్తోంది’’ అని ఆయన అన్నారు. ‘‘ఈ బడ్జెట్ తో మనం సెక్టార్ లను ఆధునికతగా మార్చుకోవచ్చు. భారతదేశంలో రైల్వే ప్రాముఖ్యత ఎంతగా వుందో ఈ బడ్జెట్ మనకు నిరూపిస్తోంది. మనకు మరిన్ని సౌకర్యాలను కల్పించుకోవడానికి వీలుగా వుంటుంది. ఈ బడ్జెట్ మన భారతదేశాన్ని అభివృద్ధి దిశకు తీసుకెళ్తుంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే సదానందగౌడ వెల్లడించిన ఈ బడ్జెట్ ప్రకారం.. కొత్త ప్రాజెక్టులను త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన అన్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more