(Image source from: central minister sadananda gouda releases railway budget of 2014-15)
మంగళవారంనాడు లోక్ సభలో కేంద్రమంత్రి సదానందగౌడ రైల్వే బడ్జెట్ సమావేశాలను ప్రారంభించారు. ఇందులో భాగంగానే భారత ఆర్థిక వ్యవస్థలకు రైల్వే వ్యవస్థ ఆత్మ లాంటిదని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న తరుణంలో ఆయన మాట్లాడుతూ... కొత్త రైళ్లు, లైన్ల కోసం ఎంపీల నుంచి ఎన్నో విజ్ఞప్తులు వచ్చాయని ఆయన తెలిపారు.
అలాగే రైల్వే శాక ప్రతిరోజు 2.30 కోట్లమంది ప్రయాణీకులను తమ గమ్యస్థానానికి చేరుస్తుందని తెలిపారు. రైల్వే శాఖను మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్రం ప్రణాళికలను సిద్ధం చేస్తోందంటూ మాట్లాడిన ఆయన... త్వరలోనే సేఫ్టీతో కూడిన హైస్పీడ్ ట్రెయిన్లను, భద్రతా విషయంలో సెక్యూరిటీని నెలకొల్చుతామని ఆయన వెల్లడించారు. సరుకు రవాణాలో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేర్చడమే భారత రైల్వే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
1. గత కొన్నేళ్లుగా రవాణా రంగంలో రైల్వే ఆదాయం చాలా తగ్గుతూ వస్తోంది. అలాకాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థగా రైల్వేలను అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు.
2. ప్రస్తుతం రైల్వేకు వస్తున్న ఆదాయంలో ఒక రూపాయికిగాను 94పైసలు ఖర్చవుతోందని ఆయన స్పష్టం చేశారు.
3. గతంలో ప్రవేశపెట్టిన కొత్త ప్రాజెక్టులు ఇప్పటివరకు కేవలం ఆమోదం పొందాయే తప్ప... వాటిని పూర్తి చేయడంలో దృష్టి సారించలేదని ఆయన అన్నారు. దాదాపు 359 ప్రాజెక్టులు ఇంకా పూర్తి చేయాల్సి వుందని ఆయన వెల్లడించారు.
4. ఇప్పటివరకు పెండింగ్ లో వున్న ప్రాజెక్టుల కోసం సుమారు రూ.1.82 లక్షల నిధులు అవసరం వుందని ఆయన తెలిపారు.
5. రైల్వే స్పీడును గంటకు 160 కి.మీ నుంచి 200 కి.మీ. వరకు పెంచేలా నిర్ణయాలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
6. రైల్వే రిజర్వేషన్ల విధానాన్ని మారుస్తామని చెప్పిన ఆయన... రిజర్వేషన్ల కోసం ప్రత్యేకంగా పోస్టాఫీసులను కూడా ఉపయోగించుకుంటామని అన్నారు.
7. మహిళలకోసం ప్రత్యేకంగా 4వేలమంది మహిళా ఆర్పీఎఫ్ పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
8. వృద్ధులకు, వికలాంగులకు కోసం రైల్వే స్టేషన్లలో బ్యాటరీ వాహనాలను ఏర్పాటు చేస్తాయని ఆయన పేర్కొన్నారు.
9. 5 సంవత్సరాలలోపు రైల్వేశాఖలో పేపర్ లెస్ ఆఫీసులను నిర్మిస్తామని ఆయన తెలిపారు.
10. కొన్ని ప్రత్యేకమైన సెక్టార్లలో బుల్లెట్ ట్రెయిన్ల నిర్మాణం
11. అన్నీ ‘‘ఏ’’ కేటగిరి ట్రెయిన్లలో వై-ఫై సౌకర్యాలు ఏర్పాటు చేయడం
12. 2014-15 రైల్వే బడ్జెట్ 1,64,374 గా అంచనా!
13. ఛార్జీల పెంపుతో రూ. 8వేల కోట్ల ఆదాయం లభించింది.
14. అన్ని ప్రధాన స్టేషన్లలో లిఫ్ట్ లు, ఎస్కలేటర్లు నిర్మాణం
15. స్టషన్లలో భద్రతను పరిశీలించేందుకు ప్రతిచోటా సీసీటీవీల ఏర్పాటు
16. సీటు, బెర్త్ మాత్రమే కాకుండా.. కోచ్, రైలును కూడా బుక్ చేసుకునే సౌకర్యం.
17. ఆర్పీఎఫ్ సిబ్బందికి ప్రత్యేకమైన సెల్ ఫోన్లు
18. ప్రైవేటు భాగస్వామ్యంతో చేతులు కలిపి మౌలిక వసతుల కల్పించేందుకు ప్రాధాన్యత
19. 50 మేజర్ స్టేషన్లలో పారిశుధ్యత కార్యక్రమాలను ఔట్ సోర్సింగ్ ద్వారా నిర్వహించడం
20. రైల్వే సిబ్బంది సంక్షేమ నిధి రూ.500 కోట్ల నుంచి 800 కోట్ల వరకు పెంచడం.
21. కాపలా లేని 5400 రైల్వే లెవెల్ క్రాసింగ్ లను మూసివేయడం
22. నూతనంగా రైల్వే యూనివర్సీటీలను నిర్మించడం
23. ప్రజల సంక్షేమం, భద్రతా కోసం 17000మంది ఆర్పీఎఫ్ సిబ్బంది.
24. ఆన్ లైన్ ద్వారా ప్రయాణ, ప్లాట్ ఫాం టికెట్ల విక్రయాలు
25. విమానాశ్రయ స్థాయిలో ప్రధాన రైల్వే స్టేషన్లలో కూడా ఆధునీకరణ విధానాలు
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more