కడపునిండిన తర్వాతనే వినోదమైనా, క్రీడలైనా, విదేశీయానమైనా, విహారయాత్రలైనా అన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతపు ఆలోచనగా కనిపిస్తోంది. ఫుట్ బాల్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ని చూడటానికి నరేంద్ర మోదీకి ఆహ్వానం అందింది. కానీ ఆయన రావటం లేదని చెప్పేసారు.
విదేశాలతో మైత్రిని కూడా ప్రధానంగా తీసుకున్న మోదీకి ఈ పర్యటన నిజానికి మంచి అవకాశం ఇస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతిని గాంచిన మోదీ హాజరవటం వార్తలలోకి ప్రముఖంగా ఎక్కుతుంది. బ్రిక్ దేశాల అధినేతలతో కలిసి కూర్చుని మ్యాచ్ ని చూడటమే కాకుండా వాళ్ళందరితోనూ సత్సంబంధాలను నెలకొల్పటానికి ఎంతో అవకాశాన్ని కల్పించే ఆహ్వానమది. కానీ మోదీ రానని చెప్పేసారు. ఈ విషయంలో ప్రధాని కార్యాలయం నుంచి ఎటువంటి వివరణా రాలేదు.
అయితే దేశంలోని పరిస్థితిని చూస్తే అగమ్య గోచరంగా ఉంది. ధరలను అదుపులో ఉంచటానికి వివిధ ప్రణాళికలు వేస్తున్న సందర్భంలో ఋతుపవనాలు కూడా అదనులో రాక నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలు వస్తున్నాయి. అవి ఆకాశాన్నంటే ప్రయత్నంలో ఎగురుతున్నాయి, ఈ లోపులో విమర్శలకు ఎక్కడ సందు దొరుకుతుందా అని ప్రతిపక్షాలు కాచుకుని కూర్చున్నాయి. బడ్జెట్ మీద ఇప్పటికే రణగొణధ్వనులు మిన్నంటుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మోదీ మ్యాచ్ లను చూడటానికి పోవటానికి తిరస్కరించటాన్ని అర్థం చేసుకోవచ్చు. కాళ్ళముందున్న సమస్యను ముందుగా పరిష్కరించుకోవటమే ప్రధమ కర్తవ్యమని మోదీ భావించివుండవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
ధరలు పెరిగిపోయినా, భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉన్నా, ఒక వార్తాపత్రిక నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలో మోదీ మీద దేశప్రజల నమ్మకం ఏమాత్రం తగ్గలేదని తెలుస్తోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more