40 indians abducted in iraq confirmed

40 Indians abducted in Iraq confirmed, 40 Indian workers in Mosul in Iraq abducted, Official representative Syed Akbaruddin confirms Indians abduction in Iraq

40 Indians abducted in Iraq confirmed

ఇరాక్ లో భారతీయుల అపహరణ ధృవీకరణ

Posted: 06/18/2014 05:44 PM IST
40 indians abducted in iraq confirmed

హింసాత్మకంగా మారిన ఇరాక్ లో భవన నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న భారత దేశానికి చెందిన పనివాళ్ళు 40 మంది అపహరణకు లోనయ్యారన్న విషయాన్ని ఇరాక్ రూఢి చేసిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ మీడియా సమావేశంలో ప్రకటించారు.  అందులో ఎక్కువ మంది ఉత్తర భారతంలో పంజాబ్ రాష్ట్రానికి చెందినవారే.  అయితే వాళ్ళు ఇరాక్ లో ఏ ప్రాంతంలో పనిచేస్తున్నారు, ఎక్కడ నుండి అపహరణకు లోనయ్యారన్నది చెప్పటం కష్టమేనన్నారు అక్బరుద్దీన్.  

ఆ కార్మికుల అపహరణ జరిగిందన్న విషయాన్ని ఇంటర్నేషనల్ రెడ్ క్రిసెంట్ ధృవీకరించింది.  అయితే, వాళ్ళని విడిపించటానికి అందుబాటులో ఉన్న ఏ  ఒక్క యత్నాన్ని వదిలిపెట్టమని ఆయన అన్నారు.  అంతకు ముందు ఒక వార్తా పత్రికలో వచ్చిన కథనం ప్రకారం, ఇరాక్ లోని మోసుల్ పట్టణంలో క్షీణించిన భద్రత వలన ఆ నలభై మంది కార్మికులను మిలిటెంట్లు తీసుకునిపోయారని రాసింది.  

భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇరాక్ లో మొత్తం 120 మంది భారతీయులు ఇరాక్ రాజకీయ సంక్షోభంలో చిక్కుకునిపోయి ఉన్నారు.  వారిలో టిక్రిట్ లో ఇరుక్కున్న 46 మంది కేరళకు చెందిన నర్సులు ఉన్నారు.  వారందరినీ బయటకు తీసుకునిరావటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.  

భారత దేశం నుంచి అంతకు ముందు అక్కడ పనిచేసిన ఎన్వోయ్ ని ఇరాక్ లో ఎంబసీలను పటిష్టం చేసేందుకు భారత ప్రభుత్వం అక్కడికి పంపుతోంది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles