రాబందుల గురించి చాలా నీచంగా మాట్లాడుతుంటారు. ఎందుకంటే అవి శవాలను పీక్కుతినే పక్షిజాతి కాబట్టి. అవసరానికి మాత్రమే ముఖం చూపించి బంధువుల దగ్గర్నుంచి వీలయినంత ఒడిసిపట్టుకుందామనుకునే వారిని వాళ్ళు బంధువులు కారు రాబందులు అని అంటుంటారు. చనిపోయిన శవాలనే కాదు, యుద్ధ భూములు, ఎడారులలో చనిపోవటానికి తయారుగా ఉండి లేవలేని స్థితిలో ఉన్నవారిని కూడా ఒక పక్కనుంచి రాబందులు పీక్కుతినటం మొదలుబెట్టేస్తాయి. అలాంటప్పుడు కంటి ముందే తన శరీరాన్ని తింటున్న రాబందుని ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా నరకం అనుభవిస్తుంటారు. అందుకే, సమాజంలో బలహీనుడి దగ్గర్నుంచి లాక్కునేవారిని రాబందులతో పోలుస్తారు. వెయ్యి శవాలను తిన్న రాబందైనా ఒక్క గాలివానకు చచ్చిపోతుందని కూడా అటువంటివారిని అంటుంటారు.
అయితే ప్రకృతిలోని ప్రతి జీవి ఎంతో ప్రణాళికాబద్ధంగా సృష్టించబడిందే. శవాలు కుళ్ళిపోయి వాతావరణాన్ని కలుషితం కాకుండా చేసే గొప్ప జీవి రాబందు. కానీ ఈ రాబందు జాతి నశించే సమయం ఆసన్నమైంది. ప్రకృతిలో ఎక్కడా కనపడకుండా చరిత్రలోనే మిగిలిపోయిన అనేక జీవరాశుల జాబితాలో రాబందు కూడా చేరబోతోంది.
అందువలన వాటిని కాపాడటానికి ముందడుగు వేసింది ఆరులాగమ్ అనే కోయంబత్తూరుకి చెందిన స్వచ్చంద సంస్థ. అందుకోసం గ్రామాలలోని ప్రజలకు అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వన్య ప్రాణుల రక్షణకోసం ప్రభుత్వం వివిధ ప్రణాళికలు వేస్తోంది కానీ తమ సంస్థ గ్రామీణ ప్రాంతంనుంచి అవగాహనను పెంచి ఆ విధంగా వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నదని ఆరులాగమ్ సంస్థ సెక్రటరీ ఎస్. భారతీ దాసన్ అన్నారు.
రాబందులు మనుషులను కానీ జంతువులను కానీ ఏమీ చెయ్యవని, చనిపోయిన జంతువుల శవాలను మాత్రమే తింటాయని, అలా చెయ్యకపోతే వాతావరణ ప్రధూషితమై రోగాలు చెలరేగే ప్రమాదమున్నదని, అటువంటి వాటిని నివారించే రాబందులను రక్షించటం మన కర్తవ్యమని కోయంబత్తూరు పంచాయతీ ప్రెసిడెంట్ జయశ్రీ నాగరాజన్ అన్నారు.
అందువలన రాబందులు లేని చోట ఇతర ప్రాంతాల నుంచి తీసుకునివచ్చైనా అవి అక్కడ గూడు కట్టుకుని నివసించేట్టుగా చెయ్యటం మానవాళికి, వారిమీద ఆధారపడ్డ జంతుజాలానికి మంచి చేస్తుందని నమ్ముతూ కోయంబత్తూర్ లో రాబందుల రక్షణ కోసం కృషిచేస్తున్నారు.
భగవంతుడు సృష్టించిన, మనతో భూమ్మీద జీవిస్తున్న జంతుజాలం మీద ప్రేమ లేకపోయినా కనీసం మనకు అవసరానికి పనిచేస్తున్నాయని తెలిసిన తర్వాతైనా ఆయా జంతు, పక్షిజాలాలను రక్షించటం మంచిదేమో.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more