సీమాంధ్రలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన దౌర్జన్యకాండలు ఈ విధంగా ఉన్నాయి.
నెల్లూరు వైయస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో రిగ్గింగ్ జరిగింది. ఏకపక్షంగా పోలింగ్ జరుగుతుంటే దాన్ని చిత్రీకరించబోయిన మీడియాను అధికారులే అడ్డుకున్నారు. దానితో యదేచ్ఛగా రిగ్గింగ్ సాగింది.
చంద్రగిరి నియోజకవర్గంలోని నడవలూరులో ఎన్నికల అధికారి మీదనే దాడిచెయ్యటంతో వాళ్ళు కాసేపు పోలింగ్ ని నిలిపివేసారు. దాన్ని చిత్రీకరించబోయిన మీడియా ప్రతినిధుల మీద వైకాపా కార్యకర్తలు దాడి చేసి వాళ్ళ దగ్గర్నుంచి కేమెరాలను లాక్కోబోయారు.
చంద్రగిరిలో పోలింగ్ బూత్ లో వైకాపా ఏజెంట్ గా హోంగార్డ్ నియమించబడ్డాడు. తెలుగు దేశం పార్టీ ఫిర్యాదు చెయ్యగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
కడప జిల్లా జమ్మలమడుగు మండలం దేవగుడిలో అడిషనల్ ఎస్పీ అప్పలనాయుడు మీద వైకాపా కార్యకర్తలు దాడిచేసారు. అదే మండలంలో ఎనిమిది గ్రామాలలో తెదేపా ఏజెంట్లు లేకపోవటంతో ఎన్నికలు ఏకపక్షమయ్యాయి. ఆ గ్రామాలు, గొరిగనూరు, ధర్మాపురం, దానవులపాడు, సుగుమంచిపల్లి, సున్నపురాళ్ళపల్లి, దేవగుడి, పెద్ద దండ్లూరు.
కడప జిల్లా జమ్మలమడుగు తెలుగు దేశం పార్టీ అభ్యర్థి రామ సుబ్బారెడ్డి మీద దాడిచేసిన వైకాపా కార్యకర్తలు గోరిగనూరు పోలింగ్ బూత్ లో ఏజెంట్లుగా కూర్చోబెడదామనుకుని తీసుకునివెళ్తున్న వారిని అపహరించుకుని పోయారు.
కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం జె కొత్తపల్లిలో తెదేపా అభ్యర్థి పుట్టా సుధాకర యాదవ్ ఇంటి మీద దాడి చెయ్యగా ఆయన కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి.
కడప జిల్లా చాపాడు మండలం వెదురూరులో తెదేపా అభ్యర్థి పుట్టా సుధాకర్ కారు మీద రాళ్ళ దాడిచేసారు.
కడప జిల్లా రాజంపేట మండలంలో బాలరాజు పల్లె, పెద్దూరు పోలింగ్ బూత్ లలో తెదేపా ఏజెంట్ల మీద వైకాపాకి చెందిన గ్రామ సర్పంచి పుర్రు నాగేశ్వరరావు మారణాయుధాలతో దాడిచేసారు. ఆ దాడిలో తెదేపా గాయపడిన ఏజెంట్లు, కార్యకర్తలు- వెంకటరామరాజు, సీతారామరాజు, రఘురామరాజు, బలరామరాజు, కృష్ణమనాయుడు. వాళ్ళని హాస్పిటల్ తరలిస్తుండగా వైకాపా కార్యకర్తలు వాహనం మీద మరోసారి దాడిచేసారు.
అనంతపురం జిల్లా ముదిగుబ్బలో వైకాపా నేత పెద్దిరెడ్డి పోలింగ్ బూత్ లో ఉన్న తెదేపా ఏజెంట్లను బెదిరించారు.
గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఆరు గ్రామాలలో తెదేపా ఏజెంట్లు లేక ఎన్నికలు ఏకపక్షమయ్యాయి. ఆ గ్రామాలు- రంగారెడ్డి పాలెం, బసికాపురం, ఉప్పలపాడు, బుచ్చివారిపాలెం, రామిరెడ్డి పాలెం, రొంపిచర్ల. తెదేపా ఏజెంట్లను పోలింగ్ బూత్ లోంచి గెంటేసారు.
నరసరావు పేట తెదేపా అభ్యర్థి రాయపాటి సాంబశివరావు వాహనం మీద, ఆయన అనుచరుల మీద వైకాపా కార్యకర్తలు దాడిచేసారు.
ప్రాంతీయ సాక్షి కార్యాలయాలకు పిలిచి వోటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్న వైకాపా నాయకులు దొరికిపోయారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more