సీమాంధ్రలో ఎన్నికల కురుక్షేత్రం తుదిదశకు చేరుకుంది. కొన్నిగంటల్లోనే ప్రచారానికి తెరపడనుంది. 23 రోజులుగా ప్రచారంతో హోరెత్తించిన నేతల మైకులు నేటి సాయంత్రం నుంచి మూగపోనున్నాయి. పోలింగ్కు 48 గంటల ముందు అన్ని రకాల ప్రచారాలు నిలిచిపోనున్నాయి. సీమాంధ్రలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు మాటల యుద్ధంతో హోరెత్తిస్తున్న ఎన్నికల ప్రచారం ఈరోజుతో ముగియనుంది.
సీమాంధ్రలో మండుటెండలను సైతం లెక్క చేయకుండా టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్, కేంద్ర మంత్రి చిరంజీవి, మాజీ సిఎం, జైసమైక్యాంధ్ర పార్టీ నాయకుడు కిరణ్ సహా పలువురు అగ్రనాయకులు ప్రతి రోజూ ఎన్నికల ప్రచార సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.
నాయకుల టూర్లతో సీమాంధ్రలోని పట్టణాలు, పల్లెల్లో సందడి నెలకొంది. హేమాహేమీల రాకతో ఎన్నికల ప్రచారం పతాకస్థాయికి చేరుకుంది. ఒకవైపు ప్రచారపర్వం ముగుస్తున్నా నేతల విమర్శలు, ప్రతి విమర్శలు ఏమాత్రం తగ్గడం లేదు. ఎన్నికల సాక్షిగా పలు పార్టీల నేతలు మాటల తూటాలు పేల్చుకున్నారు. తమ ప్రసంగాలతో కాక పుట్టిస్తున్నారు. చివరి క్షణంలో వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. హామీల జల్లు కురిపిస్తూ దూసుకెళ్తున్నారు.
సీమాంధ్రలో మే ఏడో తేదీన ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా జరిగే పోలింగ్లో 3.68 కోట్లకు పైచిలుకు ప్రజలు వారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇదిలా ఉండగా టిడిపి-బిజెపి కూటమికి మద్దతుగా బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడి చంద్రబాబు, పవన్లతో కలిసి గతవారం సీమాంధ్రలో ఆరు ప్రచార సభలను ఉద్దేశించి ప్రసంగించారు.
అయితే బూత్ స్థాయిలో జరిగే రాజకీయ సమీకరణలు, గల్లీ నాయకులతో చేసుకునే బేరసారాలు చాలామంది అభ్యర్థుల అంచనాలను, జాతకాలను నిర్ణయించబోతున్నాయి.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more