వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో 2014 ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో 24 లోక్ సభకు, 170 శాసనసభకు పోటీచేసే అభ్యర్థుల పేర్లున్నాయి. ఇందులో అసెంబ్లీకి 14 మంది మహిళా అభ్యర్తులు, నలుగురు మైనారిటీ అభ్యర్థులు ఉన్నారు. లోక్ సభకు ఐదుగురు మహిళా అభ్యర్థులు ఎంపికచెయ్యబడ్డారు.
వైయస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కడప జిల్లాలో పులివెందుల అసెంబ్లీ స్థానానికి, గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ విశాఖపట్నం నుంచి పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్నారు. పాదయాత్రలు ర్యాలీలతో వైయస్ ఆర్ కాంగ్రెస్ ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న వైయస్ జగన్ సోదరి షర్మిల పేరు పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో లేదు.
ఆమె ఎన్నికలలో పోటీ చెయ్యనని ఎప్పుడో చెప్పారని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ మారినందుకు బహిష్కరించబడ్డ వారందరికీ పార్టీ టికెట్లు ఇవ్వబడ్డాయి. అభ్యర్థులలో పేరెన్న వారు –
పార్లమెంటు స్థానాలకు- విజయవాడ నుంచి పారిశ్రామకవేత్త కోనేరు రాజేంద్ర ప్రసాద్, నర్సారావు పేట నుంచి అల్లా అయోధ్యరామిరెడ్డి, ఏలూరు నుంచి తోట చంద్రశేఖర్, తిరుపతి నుంతి వి.వరప్రసాదరావు, అరకు నుంచి కొత్తపల్లి గీత, మాజీ మంత్రి విశ్వరూప్, జగన్ సమీప బంధువులు వైవి సుబ్బారెడ్డి ఒంగోలు నుంచి, కడప నుంచి వైయస్ అవినాష్ రెడ్డి, మచిలీపట్నం నుంచి మాజీ మంత్రి కొలుసు పార్థసారధి,
సీనియర్ నాయకులు కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావులు అభ్యర్థుల జాబితాలో లేరు కానీ, వాళ్ళ కుమారులు కొణతాల రఘు కి అనకాపల్లి, దాడి రత్నాకర్ విశాఖపట్నం పశ్చిమం నియోజకవర్గాలను సంపాదించుకున్నారు.
ఇంకా ప్రముఖలలో సిని నటి రోజా, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కొత్తపల్లి సుబ్బరాయుడు, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్ర బోస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, తమ్మినేని సీతారాం, జ్యోతులకు పార్టీ టికెట్ లు లభించాయి. సిట్టింగ్ ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకరరావు, దేశాయ్ తిప్పారెడ్డి కూడా టికెట్లు సంపాదించారు.
త్వరలో విడుదల కానున్న రెండవ జాబితాలో బాపట్ల పార్లమెంటు స్థానానికి, పి గన్నవరం, అచంట, పాలకొల్లు, సంతనూతులపాడు మార్కాపురం అసెంబ్లీ అభ్యర్థుల వివరాలు వెల్లడికాబోతున్నాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more