జనసేన అధినేత పవన్కళ్యాణ్ అహ్మదాబాద్లో బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. జరగబోయే ఎన్నికల్లో సీట్ల సర్దుబాట్లపై చర్చిండమే ప్రధాన ఎజెండాగా ఉన్నట్లు తెలుస్తోంది.
బిజెపి, టిడిపిలతో అవగాహన కుదుర్చుకునే దిశగా పవన్ వెళ్తున్నారన్న వార్తలను నిజం చేస్తూ పవన్ మోడీని కలిసిన తరువాతపవన్ మీడియాతో మాట్లాడారు. తాను అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని పునరుద్ఘాటించారు.
రెండు ప్రాంతాల్లో విభేదాలు దేశ సమగ్రతకు మంచిది కాదని పేర్కొన్నారు. ప్రాంతాల మధ్య విభేదాల వల్ల యువతలో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. రెండు రాష్ట్రాల సమస్యలపై మోడీతో చర్చించానని చెప్పారు. విభజించిన తీరు సరిగా లేదని మోడీ తో పవన్ సూదీర్ఘంగా చర్చించినట్లు చెప్పారు. అయితే ప్రధాని అభ్యర్థిగా మోడీకి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు.
మోడీ ప్రధాని అవుతారన్న విశ్వాసం తనకు ఉందని, తెలుగు ప్రజలందరి తరపున మోడీకి మద్దతు తెలిపేందుకు అహ్మదాబాద్ వచ్చానన్నారు. దేశానికి మోడీ అవసరం చాలా ఉందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజలమధ్య సమైక్యత ఎందుకు తేలేకపోయారని సమావేశంలో మోడీ అడిగినట్లు పవన్ చెప్పటం జరిగింది. అదే సమయంలోనే సూరత్ లో తెలుగువాళ్లు ఐక్యంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు లేరని కూడా మోడీని అడిగినట్లు తెలిపారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మద్దతు, రాష్ట్ర రాజకీయాలు, అభివృద్ధి, పంపకాలు, నీటి వాటాలు, విద్య, విద్యుత్, వైద్యం తదితర అంశాలపై పవన్ కల్యాణ్ మోడీతో చర్చించినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ మోడీతో సమావేశం దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగింది. భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more