తెలుగువారి మనోభీష్టాలను అర్థం చేసుకోకుండా రాష్ట్ర విభజనకు పూనుకున్న కాంగ్రెస్ కి అది ఆత్మహత్యా సదృశమే అయిందని ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి విశాఖపట్నం వెంకోజీపాలెం లో సిఎమ్ఆర్ ఫంక్షన హాల్ లో జరిగిన సభలో మాట్లాడుతూ అన్నారు. కాంగ్రెస్ చేసింది చారిత్రాత్మక తప్పిదమని, అందుకు మూల్యం చెల్లించుకోవలసి వస్తున్నదని అన్న కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణా అప్పాయింటెడ్ డేట్ గా ప్రకటించిన జూన్ 2 లోపులోనే సుప్రీం కోర్టు నుంచి సమైక్యాంధ్రకు అనుకూలంగా తీర్పు వస్తుందన్న ఆశాభావాన్ని కూడా వ్యక్తపరచారు. లోగడ ఎన్నోసార్లు తగిన సమయం కాదని తిరస్కరించినా, కేంద్ర ప్రభుత్వం చేసిన రాష్ట్ర విభజనను సవాల్ చేస్తూ కిరణ్ కుమార్ రెడ్డి సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ ని రాజ్యాంగ ధర్మాసనానికి పంపించింది సుప్రీం కోర్టు.
కాంగ్రెస్ పార్టీతో పాటు కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన పాపాన్ని తెలుగు దేశం పార్టీ, వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలకు అంటగట్టారాయన. ఆ రెండు పార్టీలూ విభజనకు సానుకూలంగా లేఖలు ఇవ్వబట్టే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళిందని ఆయన ఆరోపించారు.
ఆ తర్వాత విజయనగరం జిల్లాలో, పలాస, కాశీబుగ్గ, శ్రీకాకుళం లో రోడ్ షోలలో పాల్గొన్న కిరణ్ కుమార్ రెడ్డి, ఆంధ్రా ఎంపీలను కొట్టి రాష్ట్రాన్ని విభజించారని అన్నారు. ఐదు గంటల పాటు తాను రాష్ట్ర విభజన గురించి వచ్చే కష్టనష్టాలను తెలియజేసినా అధిష్టానం పట్టించుకోకుండా అసెంబ్లీలో తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో ఆమోదిస్తూ, విభజనకు పూనుకుందని కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని తూలనాడారు. అప్రజాస్వామ్య పద్ధతిలో వెళ్ళిన కేంద్ర ప్రభుత్వం తెలుగువారికి తీరని అన్యాయం చేసిందని అన్నారాయన.
అందువలన విభజనకు పాటుబడ్డ కాంగ్రెస్, వైయస్ ఆర్ కాంగ్రెస్, తెదేపా, భాజపాలను తరిమికొట్టాలంటూ కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more