ఇన్ఫోసిస్ సహ సంస్థాపకుడు, ఆధార్ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని ని కాంగ్రెస్ పార్టీ దక్షిణ బెంగళూరులో ఎన్నికలకు ఐదు సార్లు ఆ ప్రాంతం నుండి భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికైన ఎంపీ అనంత కుమార్ కి పోటీగా నిలబెట్టింది.
ఈ సందర్భంలో మాట్లాడుతూ అనంత కుమార్ ఆధార్ జాతీయ భద్రతకు ప్రమాదమని హెచ్చరించారు. పౌరులు కానివారికి ఆధార్ నంబర్ ఇవ్వరు కేవలం పౌరులకే కేటాయించటం జరుగుతోంది. ఈ విధంగా సేకరించిన భారతీయ పౌరుల వివరాలు అమెరికన్ కంపెనీ గుప్పిట్లో ఉండటం సరైనది కాదు. ఎందుకంటే ఆ అమెరికా సంస్థ పాకిస్తాన్ కి కూడా సేవలందిస్తోంది అంటూ అనంత కుమార్ ఆరోపించారు.
ఇన్ఫోసిస్ కంపెనీని స్థాపించిన ఏడుగురిలో నారాయణ మూర్తి ప్రధాన సంస్థాపకుడైతే మిగలినవారిలో నందన్ నీలేకని కూడా ఉన్నారు. ఆయన ఆధార్ యునిక్ నంబర్ వ్యవస్థకు ప్రాణంపోసారు. ఆ తర్వాత రాజకీయాలలోకి అడుగుపెట్టిన బెంగళూరువాసి నీలేకని ఈ సారి ఎన్నికలలో మొదటిసారిగా పోటీలోకి దిగుతున్నారు.
ఆధార్ నంబర్ ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వ పథకాలతో సంబంధాన్ని పెట్టటాన్ని కోర్టులు అనేకమార్లు తప్పు పట్టాయి. పథకాలతో ముడిపెట్టటం వలన ఆధార్ కి ప్రాముఖ్యత పెరిగింది. నమోదులు చకచకా జరిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్ అందులో ముందుందని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ తన వెన్ను తనే పలుమార్లు చరుచుకున్నారు. కానీ ఆధార్ నంబరు కోసం సేకరించిన డేటాకు భద్రత లేదు. ప్రభుత్వం ఆ విషయంలో ఎప్పుడూ ఎటువంటి హామీనీ ఇవ్వలేదు. విదేశీయులు కానీ, ఉగ్రవాదులు కానీ ఆ వివరాలను అందుకోలేరన్న గ్యారెంటీని ఎవరూ దేశవాసులకు ఇవ్వలేకపోయారు. ఇప్పటికే సముద్రాలు దాటిన భారత పౌరుల వివరాలు దేశానికి ఎప్పుడు ఎలాంటి ముప్పును తెస్తుందో ఎవరూ చెప్పలేరు.
ఈ విషయంలో ఆదుర్దా చూపించిన అనంత కుమార్ ఎన్నికల విషయంలో నందన్ నిలేకని వలన నష్టమేమైనా జరుగుతుందనుకుంటున్నారా అంటే, ఎంత మాత్రం లేదని, కాంగ్రెస్ అసలు తుడిచిపెట్టుకునే పోతోందని అన్నారాయన.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more